Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు మిత్రుల కోసమే సాగు చట్టాలు : ప్రధాని మోడీపై రాహుల్ ధ్వజం

Webdunia
ఆదివారం, 14 ఫిబ్రవరి 2021 (10:54 IST)
తన ఇద్దరు మిత్రుల కోసమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొత్త సాగు చట్టాలను తీసుకొచ్చారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. పైగా, దేశంలోని వ్యవసాయ వ్యాపారన్నంతా ఆ ఇద్దరు స్నేహితులకు అప్పగించేందుకు ప్రధాని అహర్నిశలు కృషిచేస్తున్నారంటూ మండిపడ్డారు. 
 
రాజస్థాన్‌ అజ్మీర్‌ జిల్లా రూపన్‌గఢ్‌లో ఆయన రైతులనుద్దేశించి ప్రసంగిస్తూ, 'రైతులకు ఆప్షన్లు ఇస్తున్నానని అంటున్నారు. అవి.. ఆకలి, నిరుద్యోగం, ఆత్మహత్యలు మాత్రమే' అని ఎద్దేవా చేశారు. 
 
కాగా, వారసత్వ రాజకీయాలపై వస్తున్న విమర్శలపై రాహుల్‌ స్పందించారు. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం తమ కుటుంబసభ్యులు ప్రధాని పదవి నిర్వహించారన్నారు. 'నాకో సైద్ధాంతిక దృక్పథం ఉంది. రాజీవ్‌ గాంధీ కొడుకుగా నన్ను చూడొచ్చు. అంతమాత్రాన సిద్ధాంతాల కోసం నేను సాగిస్తున్న పోరును ఎవరూ నిలువరించలేరు' అని ప్రకటించారు. 
 
ఇటీవల కేంద్రం మూడు కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది. అవి రైతులకు తీవ్ర హాని కలిగించేలా ఉన్నాయని, దేశంలోని కార్పొరేట్ శక్తులను మేలు చేకూర్చేలా ఉన్నాయంటూ దేశంలోని రైతులు గత రెండు నెలలుగా ఆందోళనలు చేస్తున్నారు. వీరికి పలు రాజకీయ పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫిట్ నెస్ కోసం యువత సరైన సప్లిమెంట్స్ ఎంచుకోవాలి : సోనూ సూద్

స్వార్థపూరిత విధానాలతో కాదు.. కలిసికట్టుగా ముందుకుసాగుదాం : ప్రసన్న కుమార్

నటి మీరా మిథున్ అరెస్టుకు కోర్టు ఆదేశాలు

'ఉస్తాద్ భగత్ సింగ్' : తన షెడ్యూల్‌ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments