Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు మిత్రుల కోసమే సాగు చట్టాలు : ప్రధాని మోడీపై రాహుల్ ధ్వజం

Webdunia
ఆదివారం, 14 ఫిబ్రవరి 2021 (10:54 IST)
తన ఇద్దరు మిత్రుల కోసమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొత్త సాగు చట్టాలను తీసుకొచ్చారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. పైగా, దేశంలోని వ్యవసాయ వ్యాపారన్నంతా ఆ ఇద్దరు స్నేహితులకు అప్పగించేందుకు ప్రధాని అహర్నిశలు కృషిచేస్తున్నారంటూ మండిపడ్డారు. 
 
రాజస్థాన్‌ అజ్మీర్‌ జిల్లా రూపన్‌గఢ్‌లో ఆయన రైతులనుద్దేశించి ప్రసంగిస్తూ, 'రైతులకు ఆప్షన్లు ఇస్తున్నానని అంటున్నారు. అవి.. ఆకలి, నిరుద్యోగం, ఆత్మహత్యలు మాత్రమే' అని ఎద్దేవా చేశారు. 
 
కాగా, వారసత్వ రాజకీయాలపై వస్తున్న విమర్శలపై రాహుల్‌ స్పందించారు. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం తమ కుటుంబసభ్యులు ప్రధాని పదవి నిర్వహించారన్నారు. 'నాకో సైద్ధాంతిక దృక్పథం ఉంది. రాజీవ్‌ గాంధీ కొడుకుగా నన్ను చూడొచ్చు. అంతమాత్రాన సిద్ధాంతాల కోసం నేను సాగిస్తున్న పోరును ఎవరూ నిలువరించలేరు' అని ప్రకటించారు. 
 
ఇటీవల కేంద్రం మూడు కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది. అవి రైతులకు తీవ్ర హాని కలిగించేలా ఉన్నాయని, దేశంలోని కార్పొరేట్ శక్తులను మేలు చేకూర్చేలా ఉన్నాయంటూ దేశంలోని రైతులు గత రెండు నెలలుగా ఆందోళనలు చేస్తున్నారు. వీరికి పలు రాజకీయ పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిలుకూర్ బాలాజీని దర్శించుకున్న ప్రియాంకా చోప్రా

Venu Swamy: నాగ చైతన్య-శోభితలకు వేణు స్వామి క్షమాపణలు.. ఇకపై నోరెత్తను

యూఫోరియా మ్యూజికల్ నైట్ లో ప్రతి ఒక్క రూపాయి సమాజ సేవకే : నారా భువనేశ్వరి

పుష్ప 2 కలెక్షన్స్ రూ. 1850 కోట్లు వచ్చాయా? లెక్కలేవీ అని ఐటీ అడిగిందా?

హాసం రాజా ఆపాతమధురం -2 పుస్తకావిష్కరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

పాండ్స్ యూత్‌ఫుల్ మిరాకిల్ రేంజ్ లాంచ్

ప్రతిరోజూ బాదం తినడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలు

Golden Milk: గోల్డెన్ మిల్క్ హెల్త్ బెనిఫిట్స్

తర్వాతి కథనం
Show comments