Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీ ఆస్పత్రిలో 15 గంటల్లో.. 35 మంది మృతి

Webdunia
గురువారం, 15 ఏప్రియల్ 2021 (14:33 IST)
కొవిడ్‌ రోగులకు చికిత్స అందిస్తున్న గాంధీ ఆస్పత్రిలో సోమవారం రాత్రి 10 గంటల నుంచి మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి.. అంటే కేవలం 15 గంటల వ్యవధిలో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా మరెందరో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్టు సమాచారం. 
 
కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చినా తమకేమీ కాదనే ధీమాతో నిర్లక్ష్యం చేసి.. పరిస్థితి విషమించాక చివరి నిమిషంలో ఆస్పత్రిలో చేరడమే ఇందుకు కారణమని వైద్యులు చెబుతున్నారు. మరికొందరేమో.. ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షలు ఖర్చు చేసి, చికిత్స చేయించుకుని వెంటిలేటర్‌పై ఉన్న సమయంలో గాంధీ ఆస్పత్రికి వస్తున్నారు. 
 
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు కరోనాతో వస్తే కొన్ని ఆస్పత్రులు చేర్చుకోవట్లేదు. ఇలా అన్ని ఆస్పత్రులూ తిరిగి.. చివరికి గాంధీ ఆస్పత్రికి వస్తున్నవారు ఎక్కువగానే ఉన్నారు. ఇలాంటి కారణాలేవైనాగానీ.. గాంధీ ఆస్పత్రిలో కరోనా మరణమృదంగం వినిపిస్తోంది. 
 
కాగా.. సోమవారం రాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకూ (15గంటల్లో) చనిపోయిన 35 మందిలో 45, ఆలోపు వయసువారు తొమ్మిది మంది ఉండడం గమనార్హం. మిగతావారంతా 46 నుంచి 83 ఏళ్ల వారు. ఈ 35 మందిలో 16 మంది మహిళలు కాగా, 19 మంది  పురుషులు. కాగా, ప్రస్తుతం గాంధీలో 308 మంది కొవిడ్‌ రోగులు చికిత్స పొందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments