అన్నం పెట్టనన్నందుకు భార్యను అంతం చేసిన భర్త

Webdunia
శనివారం, 5 డిశెంబరు 2020 (14:42 IST)
ఇటీవలి కాలంలో నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. చిన్నచిన్న కారణాలకే హత్యల వరకూ వెళ్లిపోతున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలోని మీర్ పేటలో దారుణం జరిగింది.
 
తనకు అన్నం పెట్టమని అడగ్గానే పెట్టలేదన్న కోపంతో ఓ భర్త ఆమె గొంతు నులిమి చంపేశాడు. వివరాల్లోకి వెళితే... మీర్ పేట పరిధిలో 40 ఏళ్ల జయమ్మ భర్త శ్రీనివాస్, కుమారుడితో కలిసి వుంటోంది. నిన్న రాత్రి ఆమె కుమారుడిని తీసుకుని బంధువుల పెళ్లికి వెళ్లి వచ్చింది.
 
ఇంటికి వచ్చిన భార్యను తనకు అన్నం పెట్టాలంటే అడిగాడు భర్త. ఐతే ఆ సమయంలో అన్నం వండేందుకు భార్య నిరాకరించడంతో ఆగ్రహం చెందిన భర్త భార్య చీరను లాగి ఆమె గొంతుకి బిగించి చంపేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: పసుపు గౌనులో గోల్డెన్ బ్యూటీ అవార్డు గెలుచుకున్న తమన్నా భాటియా

Pooja Hegde :వర్షం, పర్వత ప్రాంత ప్రార్థనాల మధ్య దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే చిత్రం షూట్

Laya: జగపతి బాబు, లయల మధ్య ఫ్యామిలీ కెమిస్ట్రీ తో వదలా నుంచి మెలోడీ సాంగ్

Sunil : పుష్ప తర్వాత నా లైఫ్ సర్‌ప్రైజింగ్ మోడ్‌లో పడింది. : సునీల్

తర్వాతి కథనం
Show comments