Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బు కోసం భార్య వేధింపులు.. హత్యచేసి కాల్చేసిన భర్త.. ఎక్కడ?

Webdunia
గురువారం, 13 జనవరి 2022 (23:00 IST)
భార్య విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి.. పదే పదే డబ్బుల కోసం భర్తను వేధించడంతో ఓ భర్త ఆమెను హతమార్చాడు. అంతేగాకుండా మృతదేహాన్ని పంట పోలాల్లోకి తీసుకువెళ్లి కాల్చేశాడు. అయితే మృతదేహం పూర్తిగా దహనం కాక పోవడంతో ఆసలు విషయం బయట పడింది. ఈ ఘటన కామారెడ్డిలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం లోని మార్కల్ గ్రామ శివారులో గత నెలలో గుర్తు తెలియని మహిళ శవం పొలంలో కనిపించింది. ఆ హత్య కేసును పోలీసులు చేధించారు.  భర్తే ఈ హత్యకు కారణమని పోలీసులు తెలిపారు.  
 
మేడ్చల్ జిల్లా గండి మైసమ్మ ప్రాంతంలో ఉండే రంజాన్ ఖాన్, ఫాతిమా ఖాతున్ (26) దంపతులు హైదరాబాద్​లో కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరు ఉత్తర ప్రదేశ్ లోని బల్ రాంపూర్ జిల్లాకు చెందిన వారు. అయితే విలాసవంతమైన జీవితం గడపడం కోసం రంజాన్ ఖాన్‌ను భార్య ఫాతిమా ఖాతూన్ నిత్యం వేధించేది.  ఆ వేధింపులు తాళలేక భార్యను భర్త హతమార్చాడు.  
 
వెంటనే రంజాన్ స్నేహితులైన రియాజ్ ఖాన్, నన్ బాబు, రిజ్వాన్ ఖాన్, పూజన్ సహాయంతో బొలెరో వాహనంలో ఫాతిమా ఖాతూన్ మృతదేహాన్ని కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మర్కల్ గ్రామానికి తీసుకొచ్చి శివారులో పడేశారు. అనంతరం పెట్రోల్ పోసి మృతదేహాన్ని కాల్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించి నిందితుడిని అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments