Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బు కోసం భార్య వేధింపులు.. హత్యచేసి కాల్చేసిన భర్త.. ఎక్కడ?

Webdunia
గురువారం, 13 జనవరి 2022 (23:00 IST)
భార్య విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి.. పదే పదే డబ్బుల కోసం భర్తను వేధించడంతో ఓ భర్త ఆమెను హతమార్చాడు. అంతేగాకుండా మృతదేహాన్ని పంట పోలాల్లోకి తీసుకువెళ్లి కాల్చేశాడు. అయితే మృతదేహం పూర్తిగా దహనం కాక పోవడంతో ఆసలు విషయం బయట పడింది. ఈ ఘటన కామారెడ్డిలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం లోని మార్కల్ గ్రామ శివారులో గత నెలలో గుర్తు తెలియని మహిళ శవం పొలంలో కనిపించింది. ఆ హత్య కేసును పోలీసులు చేధించారు.  భర్తే ఈ హత్యకు కారణమని పోలీసులు తెలిపారు.  
 
మేడ్చల్ జిల్లా గండి మైసమ్మ ప్రాంతంలో ఉండే రంజాన్ ఖాన్, ఫాతిమా ఖాతున్ (26) దంపతులు హైదరాబాద్​లో కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరు ఉత్తర ప్రదేశ్ లోని బల్ రాంపూర్ జిల్లాకు చెందిన వారు. అయితే విలాసవంతమైన జీవితం గడపడం కోసం రంజాన్ ఖాన్‌ను భార్య ఫాతిమా ఖాతూన్ నిత్యం వేధించేది.  ఆ వేధింపులు తాళలేక భార్యను భర్త హతమార్చాడు.  
 
వెంటనే రంజాన్ స్నేహితులైన రియాజ్ ఖాన్, నన్ బాబు, రిజ్వాన్ ఖాన్, పూజన్ సహాయంతో బొలెరో వాహనంలో ఫాతిమా ఖాతూన్ మృతదేహాన్ని కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మర్కల్ గ్రామానికి తీసుకొచ్చి శివారులో పడేశారు. అనంతరం పెట్రోల్ పోసి మృతదేహాన్ని కాల్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించి నిందితుడిని అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments