Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మరిదితో అఫైర్.. భర్త చీవాట్లు పెట్టడంతో రైలు పట్టాలపై శవాలై తేలారు...

Advertiesment
మరిదితో అఫైర్.. భర్త చీవాట్లు పెట్టడంతో రైలు పట్టాలపై శవాలై తేలారు...
, బుధవారం, 5 జనవరి 2022 (19:06 IST)
పచ్చని సంసారంలో వివాహేతర సంబంధాలు నిప్పుల కుంపటిని రాజేస్తున్నాయి. కామం మత్తులోపడిన కొందరు వావివరుసలు మరిచిపోయి, క్షణకాలపు శారీరక సుఖం కోసం అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇలాంటి సంబంధాలు చివరకు విషాదాంతంగా ముగుస్తున్నాయి. తాజాగా ఓ వివాహిత వరుసకు మరిది అయ్యే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలిచి భార్యను చీవాట్లు పెట్టారు. అంతే మరిదితో కలిసి లేచిపోయింది. ఆ తర్వాత వారిద్దరూ శవాలై తేలారు. ఈ దారుణం వెస్ట్ గోదావరి జిల్లాలో వెలుగు చూసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ జిల్లాలోని ఏలూరు కొత్తపేటకు చెందిన ఓ మహిళకు ఓ వ్యక్తితో కొన్నేళ్ళ క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అలా సాఫీగా సాగిపోతున్న వారి పచ్చటి సంసారంలో ఫేస్‌బుక్ చిచ్చుపెట్టింది. వరుసకు మరిది అయ్యే ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి, అక్రమ సంబంధానికి దారితీసింది. భర్త లేనపుడు తన ప్రియుడుని ఇంటికి పిలిచి రాసలీలల్లో మునిగిపోసాగింది. 
 
ఈ విషయం భర్తకు తెలిసి భార్యను మందలించింది. ఈ విషయాన్ని తన ప్రియుడికి చేరవేసింది. ఆ తర్వాత వారిద్దరూ ఇంట్లో నుంచి పారిపోయారు. తమ బండారం బయటపడటంతో తమ సంబంధం ఇకపై కొనసాగదని భావించి వారిద్దరూ ఏలూరు పవర్ పేట రైల్వే స్టేషన్ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోయే ముందు తమ మృతికి ఎవరూ కారణం కాదంటూ సూసైడ్ లేఖలు లభ్యమయ్యాయి. ఈ ఆత్మహత్యలపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఆ మహిళ మరణంతో ఆమె ఇద్దరు పిల్లలు ఇపుడు తల్లిలేని బిడ్డలుగా మారారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ ఉద్యోగుల పిఆర్సి ఫైన‌ల్... సీఎం జగన్ తో భేటీ