Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం సేవించి.. కొడవలిని కాల్చి భార్యపై దాడి..

Webdunia
గురువారం, 29 జూన్ 2023 (22:47 IST)
మద్యం సేవించి, మైకం కమ్మి, విచక్షణ కోల్పోయి ఇంటికి వెళ్లి భార్యా పిల్లలను ఇష్టమొచ్చినట్లు తిట్టి, దాడి చేస్తుంటారు. తాగి.. చిన్న మాటను పట్టుకుని రాద్ధాంతం చేస్తుంటారు. భార్యతో తాగిన మత్తులో గొడవపడి.. ఆపై కొడవలితో దాడి చేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే ఎల్లారెడ్డి పేటలో నివసిస్తున్నారు ఒగ్గు నిర్మల, మల్లేష్ దంపతులు. అయితే మల్లేష్ మద్యానికి బానిసయ్యాడు. రోజు తాగొచ్చి భార్యతో గొడవ పడుతుండేవాడు. 
 
అనంతరం ఇంట్లో ఉన్న కొడవలితో దాడి చేశాడు. దాడి చేసే ముందు కొడవలిని కాల్చి.. నిర్మల మెడ వెనుక భాగంపై పొడిచాడు. ఆమె కేకలు వేయడంతో అక్కడి నుండి పరారయ్యాడు. 
 
ఆమెను కుటుంబ సభ్యులు కరీం నగర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments