Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓవైసీ బ్రదర్స్‌కు చుక్కెదురు

ఓవైసీ బ్రదర్స్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. తెలంగాణ ప్రభుత్వం ఓవైసీ బ్రదర్స్‌కు నామ మాత్రపు ధరకు 6,500 చదరపు గజాల స్థలాన్ని కేటాయించడాన్ని సవాలు చేస్తూ షేక్ అనిషా హైకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు నిబంధనలను పక్కన పెట్టి తెలంగాణ ప్రభుత్వం ఓవైసీ

Webdunia
గురువారం, 27 సెప్టెంబరు 2018 (14:31 IST)
ఓవైసీ బ్రదర్స్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. తెలంగాణ ప్రభుత్వం ఓవైసీ బ్రదర్స్‌కు నామ మాత్రపు ధరకు 6,500 చదరపు గజాల స్థలాన్ని కేటాయించడాన్ని సవాలు చేస్తూ షేక్ అనిషా హైకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు నిబంధనలను పక్కన పెట్టి తెలంగాణ ప్రభుత్వం ఓవైసీ బ్రదర్స్‌కు  ప్రభుత్వ భూమిని ఎలా కేటాయిస్తారని పిటీషన్లో పేర్కొన్నారు అనిషా. 
 
ఇందుకోసం ఎటువంటి  టెండర్లు పిలవకుండా బిడ్డింగ్ జరపకుండా చాంద్రాయణగుట్టలో ఉన్న 6,500 చదరపు గజాల స్థలాన్ని ఎలా కేటాయిస్తారని, వెంటనే ప్రభుత్వం ఓవైసీ బ్రదర్స్‌కు కేటాయించిన స్థలాన్ని వెనక్కి తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని పిటీషనర్ కోరాడు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఒవైసీ హాస్పిటల్ కోసం కేటాయించిన భూమిపై 3 నెలల వరకు స్టే విధించింది హైకోర్టు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అసదుద్దీన్, అక్బరుద్దీన్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 3 నెలలు వాయిదా వేసింది హైకోర్టు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments