Webdunia - Bharat's app for daily news and videos

Install App

జంగారెడ్డిగూడెంలో భారీగా అక్రమ గంజాయి పట్టివేత

Webdunia
సోమవారం, 26 జులై 2021 (07:22 IST)
అక్రమంగా లారీలో తరలిస్తున్న 80 లక్షల విలువ గల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జంగారెడ్డిగూడెం సిఐ ఎస్ గౌరీ శంకర్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ ఐ కే సతీష్ కుమార్ అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని బయ్యన గూడెం గ్రామంలో నేషనల్ హైవే పై ఎస్ఐ కే సతీష్ కుమార్ తన సిబ్బందితో ఆదివారం వాహనాలు తనిఖీ చేస్తుండగా కొయ్యలగూడెం వైపు నుండి జంగారెడ్డిగూడెం వైపు వెళుతున్న గూడ్స్ కంటైనర్ లారీని తనిఖీ చేశారు.
 
తనిఖీల్లో 26 ప్లాస్టిక్ సంచుల్లో 786.55 కేజీల గంజాయిని గుర్తించామన్నారు. విచారణ చేయగా విశాఖ జిల్లా గారకొండ గ్రామ సమీపం నుండి హైదరాబాద్ మీదుగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంకు రవాణా చేస్తున్నట్లు తెలిసిందన్నారు.

దీంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నీరాజ్, దేవేంద్ర సింగ్ లను అదుపులోకి తీసుకుని కంటైనర్ను గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీని విలువ సుమారు 80 లక్షలు ఉంటుందన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments