Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించి పెళ్లి చేసుకుని నడిరోడ్డుపై మోటారు బైకు పైనుంచి తోసేశాడు

Webdunia
ఆదివారం, 23 ఆగస్టు 2020 (19:29 IST)
ప్రేమించానని వెంటపడటం... ఆ మోజు తీరిన తర్వాత వదిలించుకోవడం.. ఇలాంటి సంఘటనలు చాలాచోట్ల జరుగుతున్నాయి. అలా మోసం చేసిన వారికి ఎన్ని కఠిన శిక్షలు వేసినా మళ్లీ మామూలే. ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి.
 
వివరాల్లోకి వెళితే... బంజారాహిల్స్ రోడ్డు నంబరు 14లో నివాసం ఉండే ఓ యువతి అదే ప్రాంతంలో ఒక బట్టలకొట్టులో పని చేస్తుండేది. ఆ బట్టల కొట్టు పక్కనే రాజమండ్రిలోని, మల్లవరం నుంచి వచ్చిన యెలమాశెట్టి వెంకన్నబాబు వారి పిన్ని వాళ్ళ ఇంట్లో ఉంటూ ఓ ఆస్పత్రిలో పని చేసేవాడు.
 
 2018లో యువతికి వెంకన్నబాబుకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరిరువురూ 2019 జూలై 13వ తేదీన వెంకన్న బాబు తరపు ఒక స్నేహితుడిని వెంట అన్నవరం తీసుకెళ్లి అక్కడి నిర్మానుష్యంగా ఉన్న ఒక గుళ్లో స్నేహితుడి సాక్షిగా తాళి కట్టాడు. ఆ తర్వాత వారికి పండంటి బాబు పుట్టాడు. అతడికి ఇప్పుడు 5 మాసాలు.
 
తీరా చూస్తే... వెంకన్నబాబు, యువతిని 2020 ఆగష్టు 5వ తేదీన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు వేగంగా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం పై నుంచి నెట్టేసి అక్కడి నుండి పరారయ్యాడు. 
 
దేవుడి దయ వల్ల ఆ బాబుకు ఎలాంటి గాయాలు అవలేదు. కేసు రిజిస్టర్ చేసుకున్న పోలీసులు వెంకన్నకు ఫోన్ చేయగా స్విచాప్ అయి ఉండటంతో అతని అక్క దీవెనకు ఫోన్ చేయగా దురుసుగా సమాధానం చెప్పింది.
 
అసలు ఆ అమ్మాయితో మాకు సంబంధం లేదని ఫోన్ పెట్టిసింది. ప్రేమ పెళ్లి పేరుతో ఒక అమ్మాయిని, అభంశుభం తెలియని 5 మాసాల బాలుడిని రోడ్డు మీద వదిలేసిన ఆ నయవంచకుడిని ఏం చెయ్యాలి? ఇకనైన అమ్మాయిలు ప్రేమించేటప్పుడు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఎంతైనా అవసరం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments