Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొడుకు కోర్కె తీర్చేందుకు ఆ తల్లి, పక్కింటి బాలికను గదిలోకి తోసేసింది

కొడుకు కోర్కె తీర్చేందుకు ఆ తల్లి, పక్కింటి బాలికను గదిలోకి తోసేసింది
, బుధవారం, 19 ఆగస్టు 2020 (18:43 IST)
కొడుకు తప్పు చేస్తే దండించాల్సిన బాధ్యత తల్లిపై ఉంటుంది. అంతేకాదు ఏదైనా తప్పు జరుగుతుంటే ఆ తప్పును జరగకుండా చూసుకోవాలని కొడుక్కి మంచి బుద్ధి చెప్పాలి. కానీ ఈ తల్లి మాత్రం కొడుకు కోరిక తీర్చేందుకు ఏకంగా ఒక బాలిక జీవితాన్ని నాశనం చేసింది.
 
గుంటూరు జిల్లా వినుకొండలో నివాసముండే గోపీనాథ్ అనే యువకుడు ఇంటి పక్కనే ఉన్న 9వ తరగతి బాలికపై కన్నేశాడు. ఆమెను ఎలాగైనా సొంతం చేసుకోవాలని ప్రయత్నించాడు. రకరకాల ప్రయత్నాలు చేశాడు. అయితే ఉపయోగం లేకుండా పోయింది.
 
తన కోరికను తల్లికి చెప్పాడు. అలా చేయకూడదు తప్పు అని దండించాల్సిన తల్లి  కొడుకు కోరికను తీర్చేందుకు సిద్ధపడింది. పక్కింటిలో 9వ తరగతి చదువుతున్న బాలికను తన ఇంటికి పిలిపించుకుంది. మాయమాటలు చెప్పింది. కొడుకుని గదిలో వెయిట్ చేయమని చెప్పి యువతికి మాయమాటలు చెప్పి గదిలోకి నెట్టేసింది.
 
ఇంకేముంది ఆ యువకుడు రెచ్చిపోయాడు. ఆ బాలికపై అత్యాచారం చేశాడు. అంతా అయ్యాక మహాతల్లి బయటకు వచ్చిన బాలికను బెదిరించింది. జరిగిన విషయాన్ని మీ తల్లిదండ్రులకు చెబితే చంపేస్తానంది. అయితే ఆ బాలిక తిన్నగా వెళ్ళి జరిగిన విషయాన్ని చెప్పేసింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తల్లీకొడుకులిద్దరినీ అరెస్టు చేశారు పోలీసులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎంగిలి పాలలో గేదెలు తాగే మురికి నీటిని కలిపాడు.. షాకింగ్ వీడియో