Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూతురికి రెండో పెళ్లి చేయాలని మనవడిని చంపేసింది.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 30 జులై 2021 (22:40 IST)
కూతురికి రెండో పెళ్లి చేసేందుకు మనవడు అడ్డుగా ఉన్నాడని అమ్మమ్మే కిరాతకురాలిగా మారింది. అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన మనవడిని సొంత అమ్మమ్మే కిరాతకంగా చంపేసింది. సంగారెడ్డిలో అమానుష ఘటన జరిగింది.
 
వివరాల్లోకి వెళితే.. రెండేళ్ల బాలుడి అదృశ్యం ఘటన విషాదంగా ముగిసింది. సొంత అమ్మమ్మే చిన్నారిని అమానుషంగా హతమార్చినట్టు పోలీసుల విచారణలో తేలింది. సంగారెడ్డికి చెందిన యశ్వంత్(2) గురువారం కనిపించకుండా పోయాడు. 
 
కుటుంబ సభ్యులు, స్థానికులు చుట్టుపక్కల గాలించినా ప్రయోజనం లేకపోయింది. అయితే శుక్రవారం అనూహ్యంగా బిబ్బిలకుంట చెరువులో యశ్వంత శవమై తేలాడు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. తమదైన స్టైల్ లో విచారణ చేశారు. ఈ విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి.
 
చిన్నారి యశ్వంత్ తండ్రి రెండేళ్ల కిందట మరణించాడు. భర్త చనిపోయిన కూతురికి మరో పెళ్లి చేయాలని ఆమె తల్లి భావించింది. అయితే మనవడు ఆమెకు అడ్డుగా కనిపించాడు. అంతే, మరో ఆలోచన చేయకుండా ఏ మాత్రం కనికరం చూపకుండా మనవడిని కిరాతకంగా చంపేసి చెరువులో పడేసింది. 
 
మరొకరి సాయంతో మనవడిని అమ్మమ్మే మట్టుబెట్టింది. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తన కూతురు భవిష్యత్తు కోసమే తానిలా చేశానని నిందితురాలు చెప్పింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments