Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో స్తంభించనున్న ప్రభుత్వ వెబ్‌సైట్‌ సేవలు

Webdunia
గురువారం, 8 జులై 2021 (09:12 IST)
తెలంగాణా రాష్ట్రంలో ప్రభుత్వం వెబ్‌సైట్ సేవలు నిలిచిపోనున్నయి. రెండు రోజుల పాటు ఈ సేవలకు అంతరాయం ఏర్పడనుంది. ప్రభుత్వ ఉత్తర్వుల జారీ కూడా నిలిచిపోనుంది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ భవనంలోని రాష్ట్ర డేటా కేంద్రం (ఎస్‌డీసీ)లో కొత్త యూపీఎస్ యూనిట్ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ప్రభుత్వ వెబ్‌సైట్ సేవలకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు.
 
రాష్ట్రంలో ఆన్‌లైన్ సేవలు అంతకంతకు పెరుగుతున్నాయి. అదే సమయంలో విద్యుత్ అంతరాయాలు కూడా ఏర్పడుతున్నాయి. దీంతో ప్రస్తుతం ఉన్న అన్ ఇంటరప్టబుల్ పవర్ సప్లై (యూపీఎస్) సామర్థ్యం సరిపోవడం లేదు. 
 
ఇది ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతో దాని స్థాయిని పెంచాలని నిపుణులు ప్రతిపాదించారు. దీంతో కొత్త యూపీఎస్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రేపు రాత్రి 9 గంటల నుంచి 11వ తేదీ రాత్రి 9 గంటల వరకు ప్రభుత్వ వెబ్‌సైట్ల సేవలకు అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్న ప్రభుత్వం అన్ని శాఖలకు ఈ సమాచారాన్ని అందించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sanoj Mishra: సినిమా ఛాన్సిస్తానని యువతిపై అత్యాచారం.. మోనాలిసా టైమ్ బాగుండి..?

Mad: నవ్వినవ్వి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ : దర్శకుడు కళ్యాణ్ శంకర్

అమర్ దీప్ చౌదరి హీరోగా సుమతీ శతకం ప్రారంభం

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

తర్వాతి కథనం
Show comments