Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో రైతు రుణమాఫీకి రంగం సిద్ధం!

Webdunia
బుధవారం, 11 మార్చి 2020 (05:23 IST)
తెలంగాణలో రైతు రుణమాఫీకి రంగం సిద్ధమవుతోంది. 2018 డిసెంబర్‌ 11నాటికి ఉన్న రుణాల్లో లక్ష వరకు మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా తొలిదశలో రూ. 25వేల లోపు ఒకేసారి పంపిణీ చేసేందుకు వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోంది.

రుణమాఫీకి సంబంధించి రెండురోజుల్లో మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉంది. రైతు రుణమాఫీకి రంగం సిద్ధం బడ్జెట్‌లో రుణమాఫీకి నిధులు కేటాయించిన సర్కార్‌... ఈ మేరకు అమలు దిశగా కసరత్తు ప్రారంభించింది. తొలి దశలో రూ. 25వేలలోపు రుణాలకు సంబంధించి ఈ నెలలోనే చెక్కులు అందజేసేందుకు రంగం సిద్ధమవుతోంది.

2018 డిసెంబర్‌ 11నాటికి ఉన్న రుణాల్లో రూ. లక్ష వరకు మాఫీ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. లబ్ధిదారులు 40 లక్షల మంది.. ఇందులో భాగంగా రుణం మొత్తం ఆధారంగా రైతులను ఐదు విభాగాలుగా చేశారు. రూ. 25వేల లోపు మాత్రమే అప్పు ఉన్న 5.83 లక్షల మంది పేర్లతో బ్యాంకులు జాబితాలు సిద్ధం చేశాయి.

వీరంతా ఎకరం లోపు భూమి ఉన్న అత్యంత నిరుపేదలై ఉంటారని తొలుత వీరికి మాఫీ చేయాలని సర్కారు నిర్ణయించింది. మొత్తం 40లక్షల 66వేల మంది రైతులకు బ్యాంకుల్లో రూ. 25వేల 936కోట్లు బకాయిలు ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధ్యయనంలో తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments