మెడికల్ కాలేజ్ సిబ్బందికి గుడ్ న్యూస్, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Webdunia
గురువారం, 10 సెప్టెంబరు 2020 (17:52 IST)
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బోధనాసుపత్రిలో విధులు నిర్వహించే సిబ్బందికి జీతాలను పెంచుతూ ఉకత్తర్వులు జారీచేసింది. బోధనా సిబ్బందికి జీతాలు పెంచాలనే నిర్ణయం గత నాలుగున్నర సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉండిపోయింది. అయితే కొన్ని రోజులు క్రితమే గాంధీ ఆసుపత్రి వైద్యులు, అలాగే ఇతర సిబ్బంది కూడా తమ జీతాలు పెంచాలనే డిమాండుతో సమ్మెలో దిగారు.
 
కాగా వారి డిమాండ్లను పరిగణలోనికి తీసుకున్న ప్రభుత్వం వారి జీతాలను 24 శాతం నుంచి 44 శాతానికి పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ బోధనాసుపత్రిలో సుమారు 2,860 మంది అధ్యాపకులు ఉండగా వీరందరి వేతనాలు పెరిగాయి. ఇక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రెసిడెంట్ డాక్టర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ స్పందించారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పే రివిజన్ అమలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. గురువారం ఉత్తర్వులు ప్రకారం పెరిగిన జీతాలు ఈ నెల నుండి నగదు రూపంలో చెల్లించబడుతాయి. జీతాల వివరాలు... అసిస్టెంట్ ప్రొఫెసర్ 67,000 నుంచి 90, 000, అసోసియేట్ ప్రొఫెసర్ 80,000 నుంచి 1,00,000, ప్రొఫెసర్ 1,25,000 నుంచి 1,80,000గా పెరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తున్న ఇట్లు మీ ఎదవ

తల్లి తో అవార్డ్ అందుకున్న మధుర క్షణాల్లో సాయి దుర్గ తేజ్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments