Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రైవేట్ టీచర్లకు జీతాలివ్వని స్కూళ్లపై కఠిన చర్యలు, ఏపీ సర్కార్ ఆదేశాలు

Webdunia
గురువారం, 10 సెప్టెంబరు 2020 (17:46 IST)
కరోనావైరస్ మహమ్మారి ప్రభావం ఏపీ లోని ప్రైవేట్ ఉపాధ్యాయుల జీవితాన్ని కనుమరుగున పడేసింది. కరోనా ప్రభావం వల్ల అనేక పాఠశాలలు మూతబడ్డాయి. ఆ తర్వాత అన్‌లాక్ ప్రక్రియ మొదలైన తర్వాత ఆన్లైన్ పాఠాలు కొనసాగుతున్నాయి. అయినా మార్చి నెల నుంచి టీచర్లకు జీతమివ్వకుండా వారి సేవలను మాత్రం వాడుకుంటున్నాయి. దీంతో టీచర్లు రోడ్డున పడుతున్నారు.
 
దీనిపై సర్వత్రా వెల్లువెత్తడంతో ప్రభుత్వం స్పందించింది. ఏపీలో టీచర్లకు జీతాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న ప్రైవేటు స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీచేసింది. టీచర్లకు జీతాలు ఇవ్వని పాఠశాలలకు నోటీసులు జారీ చేయాలని తెలిపింది. దీంతో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వాడ్రేపు చిన వీరభద్రుడు ఉత్తర్వులు జారీచేశారు.
 
లాక్‌డౌన్ విధించినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు జీతాలు చెల్లించలేదని వాటిలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఉపాద్యాయులకు జీతాలు ఇప్పించే బాధ్యత డీఈవోలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. టీచర్లకు జీతాలు ఇవ్వని ప్రైవేటు స్కూలు యాజమాన్యానికి నోటీసులు జారీచేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులో పేర్కొంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments