Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎగువ నుంచి వరద పోటు.. గోదావరి వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

Webdunia
బుధవారం, 10 ఆగస్టు 2022 (12:23 IST)
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం మళ్లీ పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటు ఒక్కసారిగా వచ్చి పడింది. దీంతో గోదావరి నది వద్ద నీటి మట్టం పెరగడంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీచేశారు. 
 
ఎగువ నుంచి వరద పోటెత్తడంతో బుధవారం ఉదయం 5 గంటలకు 49.3 అడుగులుగా ఉన్న నీటిమట్టం 7 గంటల సమయానికి 49.8 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నదిలో 12,11,032 క్యూసెక్కుల వరద ప్రవహిస్తున్నది. నీటిమట్టం 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీచేయనున్నారు.
 
ఇదిలావుంటే, గోదావరి ప్రవాహం గంటగంటకూ పెరుగుతోంది. మంగళవారం సాయంత్రం 43.5 అడుగులుగా ఉన్న నీటిమట్టం.. అర్థరాత్రి ఒంటి గంటకు 48 అడుగులకు చేరింది. బుధవారం గోదావరికి వరద మరింత పెరిగే అవాకాశం ఉందని అధికారులు అంచనావేస్తున్నారు.
 
గోదావరికి వరద మరోసారి పోటెత్తడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపాడు, సారపాక, అశ్వారావుపేట, పినపాక, ఏడూళ్లబయ్యారం తదితర గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్‌ అనుదీప్‌ కోరారు. అలాగే లోతట్టు ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments