Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎగువ నుంచి వరద పోటు.. గోదావరి వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

Webdunia
బుధవారం, 10 ఆగస్టు 2022 (12:23 IST)
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం మళ్లీ పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటు ఒక్కసారిగా వచ్చి పడింది. దీంతో గోదావరి నది వద్ద నీటి మట్టం పెరగడంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీచేశారు. 
 
ఎగువ నుంచి వరద పోటెత్తడంతో బుధవారం ఉదయం 5 గంటలకు 49.3 అడుగులుగా ఉన్న నీటిమట్టం 7 గంటల సమయానికి 49.8 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నదిలో 12,11,032 క్యూసెక్కుల వరద ప్రవహిస్తున్నది. నీటిమట్టం 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీచేయనున్నారు.
 
ఇదిలావుంటే, గోదావరి ప్రవాహం గంటగంటకూ పెరుగుతోంది. మంగళవారం సాయంత్రం 43.5 అడుగులుగా ఉన్న నీటిమట్టం.. అర్థరాత్రి ఒంటి గంటకు 48 అడుగులకు చేరింది. బుధవారం గోదావరికి వరద మరింత పెరిగే అవాకాశం ఉందని అధికారులు అంచనావేస్తున్నారు.
 
గోదావరికి వరద మరోసారి పోటెత్తడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపాడు, సారపాక, అశ్వారావుపేట, పినపాక, ఏడూళ్లబయ్యారం తదితర గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్‌ అనుదీప్‌ కోరారు. అలాగే లోతట్టు ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

రామానంద్ సాగర్ కు అంకితంగా శ్రీమద్ భాగవతం పార్ట్-1 షూటింగ్ ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments