Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులకు 15 నిమిషాలు స్వేచ్ఛను ఇస్తాం : బండి సంజయ్

Webdunia
ఆదివారం, 29 నవంబరు 2020 (12:31 IST)
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల అంకం చివరి దశకు చేరుకుంది. ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆదివారం సాయంత్రం ప్రచారానికి తెరపడనుంది. డిసెంబరు ఒకటో తేదీన ఎన్నికల పోలింగ్ జరుగనుంది. అయితే, చివరి రోజు ప్రచారంలో కేంద్రం హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ నగరానికి వచ్చి బీజేపీ అభ్యర్థులకు అనుకూలంగా ప్రచారం చేశారు. 
 
ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ, పాతబస్తీలోని హిందువులంతా ఏమైపోయారని ప్రశ్నించారు. ముఖ్యంగా, శాలిబండ, అలియాబాద్, ఉప్పుగూడ, లాల్ దర్వాజ, గౌలిపుర, చాతార్నాకా వంటి ప్రాంతాల్లో ఉన్న హిందువులు ఎక్కడకి పోయారని ప్రశ్నించారు. హిందువుల ఆస్తులను ఎవరు ధ్వంసం చేశారన్నారు. ఎవరు కబ్జా చేశారని ఘాటుగా సూటిగా ప్రశ్నించారు. 
 
అంతేకాకుండా, హైదరాబాద్ నగర పోలీసులను హీరోలతో పోల్చారు. భాగ్యనగర్‌లో బీజేపీని గెలిపించండని పిలుపునిచ్చారు. పోలీసులకు 15 నిమిషాలు స్వేచ్ఛను ఇస్తామని, పాకిస్థాన్ కుక్కలను, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లను, రోహింగ్యా లుచ్ఛాలను బయటకు గుంజి తరిమేస్తామని వ్యాఖ్యానించారు. భాగ్యనగరికి బీజేపీయే రక్షణ కవచమని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

1991లో వీరరాజు కు ఏం జరిగింది?

హైదరాబాద్‌ లో అల్లు అర్జున్‌ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ పర్యవేక్షణలో అట్లీ

Ruchi Gujjar video రుచి గుజ్జర్ ఎద ఎత్తులపై ప్రధాని మోడి ఫోటోల దండ

Ratnam: వినోదంతో పాటు, సందేశం ఇవ్వాలనేది నా తపన : ఎ.ఎం. రత్నం

Pawan: మూర్తీభవించిన ధర్మాగ్రహం పవన్ కళ్యాణ్; ఐటంసాంగ్ వద్దన్నారు : ఎం.ఎం. కీరవాణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments