Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులకు 15 నిమిషాలు స్వేచ్ఛను ఇస్తాం : బండి సంజయ్

Webdunia
ఆదివారం, 29 నవంబరు 2020 (12:31 IST)
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల అంకం చివరి దశకు చేరుకుంది. ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆదివారం సాయంత్రం ప్రచారానికి తెరపడనుంది. డిసెంబరు ఒకటో తేదీన ఎన్నికల పోలింగ్ జరుగనుంది. అయితే, చివరి రోజు ప్రచారంలో కేంద్రం హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ నగరానికి వచ్చి బీజేపీ అభ్యర్థులకు అనుకూలంగా ప్రచారం చేశారు. 
 
ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ, పాతబస్తీలోని హిందువులంతా ఏమైపోయారని ప్రశ్నించారు. ముఖ్యంగా, శాలిబండ, అలియాబాద్, ఉప్పుగూడ, లాల్ దర్వాజ, గౌలిపుర, చాతార్నాకా వంటి ప్రాంతాల్లో ఉన్న హిందువులు ఎక్కడకి పోయారని ప్రశ్నించారు. హిందువుల ఆస్తులను ఎవరు ధ్వంసం చేశారన్నారు. ఎవరు కబ్జా చేశారని ఘాటుగా సూటిగా ప్రశ్నించారు. 
 
అంతేకాకుండా, హైదరాబాద్ నగర పోలీసులను హీరోలతో పోల్చారు. భాగ్యనగర్‌లో బీజేపీని గెలిపించండని పిలుపునిచ్చారు. పోలీసులకు 15 నిమిషాలు స్వేచ్ఛను ఇస్తామని, పాకిస్థాన్ కుక్కలను, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లను, రోహింగ్యా లుచ్ఛాలను బయటకు గుంజి తరిమేస్తామని వ్యాఖ్యానించారు. భాగ్యనగరికి బీజేపీయే రక్షణ కవచమని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments