GHMC ఎన్నికలు: ఓటు వేసిన కేటీఆర్, మెగాస్టార్ దంపతులు

Webdunia
మంగళవారం, 1 డిశెంబరు 2020 (10:12 IST)
ఫోటో కర్టెసీ-ట్విట్టర్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి)కు ఎన్నికల పోలింగ్ డిసెంబర్ 1న ప్రారంభమైంది. ఉదయాన్నే మంత్రి కేటీఆర్, మెగాస్టార్ చిరంజీవి దంపతులతో సహా చాలామంది సెలబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కార్పొరేషన్ పరిధిలోని ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పార్టీలన్నీ పిలుపునిచ్చాయి.
ఇకపోతే జిహెచ్ఎంసి ఓట్ల లెక్కింపు డిసెంబర్ 4న జరుగుతుంది. కార్పొరేషన్‌లో మొత్తం 150 వార్డులు ఉన్నాయి. మేయర్ పదవి ఈసారి మహిళకు కేటాయించారు. హైదరాబాద్ పౌర పరిపాలన మరియు మౌలిక సదుపాయాల బాధ్యత జిహెచ్‌ఎంసికి ఉంది. 2016 ఎన్నికల్లో AIMIM 44 సీట్లు గెలుచుకున్నది. టిఆర్ఎస్ 99 సీట్లను కైవసం చేసుకోగా, బిజెపి కేవలం 4 సీట్లు సాధించింది. టిడిపి, కాంగ్రెస్ రెండు సీట్లు గెలుచుకున్నాయి.
GHMC గురించి కాస్త...
మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ (ఎంసిహెచ్)లో 12 మునిసిపాలిటీలు, 8 గ్రామ పంచాయతీలను విలీనం చేయడం ద్వారా ఏప్రిల్ 16, 2007న జిహెచ్ఎంసి- గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పడింది. నాలుగు జిల్లాలు ఇప్పుడు జిహెచ్‌ఎంసి పరిమితుల్లోకి వస్తాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, సంగారెడ్డి. ఈ నాలుగు జిల్లాలను ఆరు మండలాలు, 30 సర్కిల్స్ మరియు 150 మునిసిపల్ వార్డులుగా విభజించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments