Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమా ఛాన్స్ ఇప్పిస్తామని చెప్పి మోసం.. యువతి ఆత్మహత్య

Webdunia
మంగళవారం, 15 ఆగస్టు 2023 (20:12 IST)
సినిమా ఛాన్స్ ఇప్పిస్తామని చెప్పి ఓ వ్యక్తి చేతిలో మోసపోయిన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. ఓ వెలుగు వెలిగిపోదామనుకున్న ఆ యువతి మోసపోయానని తెలిసి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఆఫర్లు ఇప్పిస్తాడన్న నమ్మకంతో అతనికి సర్వం అప్పగించింది బిందు. చిన్నప్పటి నుంచి నటన అంటే ఎంతో మక్కువ చూపించేది. దీంతో హీరోయిన్ అయిపోదామనుకుని హైదరాబాదులో ఛాన్సుల కోసం వెతికింది. ఈ క్రమంలో ఆమెకు పూర్ణచందర్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తనకు ఇండస్ట్రీ పెద్దలతో బాగా పరిచయాలు ఉన్నాయని.. ఆఫర్లు ఇప్పిస్తానని నమ్మించాడు. 
 
తనను నమ్ముకుంటే ఇండస్ట్రీలో హీరోయిన్ ఛాన్స్ ఇప్పిస్తానని బిందుని లొంగదీసుకున్నాడు. తన జీవిత ఆశయం నెరవేరబోతుందని ఆనందంతో తన సర్వస్వాన్ని అప్పగించింది బిందు. అంతేకాదు అతనితో సహజీవనం చేసింది. 
 
కొద్దిరోజుల తర్వాత పూర్ణచందర్ మరో యువతితో తిరగడం మొదలు పెట్టాడు.. దీంతో తాను దారుణంగా మోసపోయానని బాధతోనే రాయదుర్గంలోని 21 అంతస్తు భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పపడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments