Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రాలు పూజలు.. అబ్బబ్బా మూఢనమ్మకాల గోల.. వ్యక్తి అరెస్ట్

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (12:18 IST)
ఆధునికత పెరిగినా, స్మార్ట్ ఫోన్ల యుగం వచ్చినా మూఢనమ్మకాల గోల ఆగట్లేదు. తాజాగా మంత్రాల పేరుతో ఓ మహిళను మోసం చేసిన దొంగ బాబాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన నేరేడ్‌మెట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 
 
నిందితుడి గురువారం అరెస్టు చేసిన పోలీసులు రిమాండుకు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ నర్సింహ్మస్వామి సమాచారం మేరకు... లోయర్‌ ట్యాంక్‌బండ్‌కు చెందిన శ్యామల కొడుకు కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. 
 
ఈ విషయంలో నేరేడ్‌మెట్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని ఆర్‌.కె.పురానికి చెందిన రాకేష్‌ను ఆమె సంప్రదించింది. దీంతో మంత్రాలతో నయం చేస్తానని నమ్మించాడు. 
 
ఇందుకోసం బాధితురాలు రూ. 2.60 లక్షలతోపాటు 5 తులాల బంగారు ఆభరణాలను ఇచ్చింది. అయితే పూజ చేయకుండా వ్యక్తి మోసం చేశాడని గ్రహించిన బాధితురాలు.. ఈ క్రమంలో అనుమానం వచ్చి తన డబ్బు, బంగారు ఆభరణాలను తిరిగి ఇవ్వాలని ఇంటికి వెళ్లి నిందితుడిని గట్టిగా అడిగింది. అతడు ముఖం చాటేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments