Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రాలు పూజలు.. అబ్బబ్బా మూఢనమ్మకాల గోల.. వ్యక్తి అరెస్ట్

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (12:18 IST)
ఆధునికత పెరిగినా, స్మార్ట్ ఫోన్ల యుగం వచ్చినా మూఢనమ్మకాల గోల ఆగట్లేదు. తాజాగా మంత్రాల పేరుతో ఓ మహిళను మోసం చేసిన దొంగ బాబాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన నేరేడ్‌మెట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 
 
నిందితుడి గురువారం అరెస్టు చేసిన పోలీసులు రిమాండుకు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ నర్సింహ్మస్వామి సమాచారం మేరకు... లోయర్‌ ట్యాంక్‌బండ్‌కు చెందిన శ్యామల కొడుకు కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. 
 
ఈ విషయంలో నేరేడ్‌మెట్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని ఆర్‌.కె.పురానికి చెందిన రాకేష్‌ను ఆమె సంప్రదించింది. దీంతో మంత్రాలతో నయం చేస్తానని నమ్మించాడు. 
 
ఇందుకోసం బాధితురాలు రూ. 2.60 లక్షలతోపాటు 5 తులాల బంగారు ఆభరణాలను ఇచ్చింది. అయితే పూజ చేయకుండా వ్యక్తి మోసం చేశాడని గ్రహించిన బాధితురాలు.. ఈ క్రమంలో అనుమానం వచ్చి తన డబ్బు, బంగారు ఆభరణాలను తిరిగి ఇవ్వాలని ఇంటికి వెళ్లి నిందితుడిని గట్టిగా అడిగింది. అతడు ముఖం చాటేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments