Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహబూబ్ నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

Webdunia
గురువారం, 16 జులై 2020 (07:38 IST)
మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తొర్రూరు మండలం చీకటాయపాలెం గ్రామంలోని ఎక్కలదాయమ్మ చెరువు కట్టమీద నుంచి అక్రమంగా కర్ర లోడుతో వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో లారీలో ఉన్న నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో లారీలో మొత్తం 11 మంది కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న డీఎస్పీ వెంకటరమణ, సీఐ చేరాలు, ఎస్సై నగేష్‌, ఆర్డీవో ఈశ్వరయ్య, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
 
ఈ ఘటనలో సురక్షితంగా బయటపడ్డ ఏడుగురు కూలీలు రంగారెడ్డి జిల్లాలోని మంచాల మండలం అంబోతులా తండకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

ప్రమాదంలో మృతి చెందిన వారిలో హర్యా, గోవిందర్, మధు, ధూర్యా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

తర్వాతి కథనం
Show comments