Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహబూబ్ నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

Webdunia
గురువారం, 16 జులై 2020 (07:38 IST)
మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తొర్రూరు మండలం చీకటాయపాలెం గ్రామంలోని ఎక్కలదాయమ్మ చెరువు కట్టమీద నుంచి అక్రమంగా కర్ర లోడుతో వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో లారీలో ఉన్న నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో లారీలో మొత్తం 11 మంది కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న డీఎస్పీ వెంకటరమణ, సీఐ చేరాలు, ఎస్సై నగేష్‌, ఆర్డీవో ఈశ్వరయ్య, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
 
ఈ ఘటనలో సురక్షితంగా బయటపడ్డ ఏడుగురు కూలీలు రంగారెడ్డి జిల్లాలోని మంచాల మండలం అంబోతులా తండకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

ప్రమాదంలో మృతి చెందిన వారిలో హర్యా, గోవిందర్, మధు, ధూర్యా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments