Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిర్యానీ తిందామని వెళ్లిన నలుగురు.. చివరికి వరదలో చిక్కుకుని..?

Webdunia
గురువారం, 15 అక్టోబరు 2020 (10:35 IST)
బిర్యానీకి హైదరాబాద్ పెట్టింది పేరు. అలా మాంచి బిర్యానీ లాగించాలనుకున్న నలుగురు స్నేహితులు జనగామలో ఏదైనా బిర్యానీ సెంటర్‌లో డిన్నర్‌ చేసేందుకని కారులో ప్రయాణమయ్యారు. సుమారు రాత్రి 10 గంటల సమయంలో వారు బయలుదేరారు. 
 
జనగామ-హుస్నాబాద్‌ రహదారిపై వడ్లకొండ గ్రామం వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోందని పోలీసులు వారించినా కల్వర్టు మీదుగా వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వరద నీటి ఉద్ధృతితో కారు కొట్టుకుపోవడంతో నలుగురు యువకులు వరద నీటిలో చిక్కుకొన్నారు. 
 
అర్ధరాత్రి వరకు సహాయక చర్యలు చేపట్టి వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. వడ్లకొండ శివారు సుందరయ్యనగర్‌కు చెందిన రెడ్డబోయిన నరేశ్‌, రెడ్డబోయిన కనకరాజు, మరిగడికి చెందిన పుట్ట రవి, వట్నాల వెంకటేశ్‌ ఉదంతమిది. పోలీసు సిబ్బంది హెచ్చరించినా.. అత్యుత్సాహంతో కారు నడపటంతో వరద ఉద్ధృతికి ఆ వాహనం సుమారు అర కిలోమీటరు వరకు వాగులో కొట్టుకెళ్లింది. వాగు మధ్యలో ఉన్న తాటిచెట్టు కారును అడ్డుకుంది.
 
కారులోని ఒకరి చరవాణి ద్వారా వారి కుటుంబ సభ్యులు, గ్రామస్థులకు సమాచారమందించారు. వెంటనే గ్రామస్థులు, పోలీసు సిబ్బంది ఉన్నతాధికారులు, పోలీసులకు సమాచారం అందించగా అందరూ హుటాహుటిన చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు చాలాసేపు పోరాడి వారిని కాపాడారు అధికారులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments