Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమికురాలికి పరువు శిక్ష... గుండు గీసి, నాలుకపై వాత...

Webdunia
శనివారం, 13 అక్టోబరు 2018 (21:07 IST)
యువతులపై దారుణాలు ఆగడంలేదు. తాజాగా ఓ యువతి తన కులం కాని ఓ యువకుడిని ఇష్టపడిందని, పెళ్లి చేసుకునేందుకు అంగీకరించిందని ఆ ఊరి గ్రామ పెద్దలు ఆమెకు పరువు శిక్ష విధించారు. ఆమె నాలుకపై బంగారు కడ్డీతో వాతలు పెట్టి, గుండు కొట్టించాలని తీర్మానించారు.
 
వివరాల్లోకి వెళితే... జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం బీంరెడ్డి గూడెం గ్రామానికి చెందిన 18 ఏళ్ల యువతి రేచపల్లికి చెందిన 20 ఏళ్ల యువకుడు ప్రేమించుకున్నారు. ఐతే వీరిరువురి కులాలు వేరు. దీనితో ఆరు నెలల క్రితం యువతి తల్లిదండ్రులు యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ గొడవల మధ్య తమ కుమార్తె తమ ఊరిలో ఎందుకు అనుకుని ఆమెను తమ దూరపు బంధువుల ఇంట్లో వుంచారు. 
 
ఐతే గొడవ కాస్త సద్దుమణిగిందని యువతిని సొంత ఊరికి తీసుకుని వస్తుండగా గ్రామ పెద్దలు అడ్డుకున్నారు. కులం కాని కులానికి చెందిన యువకుడిని ప్రేమించిన మీ కుమార్తె గ్రామంలో వుండటానికి వీల్లేదనీ, ఒకవేళ గ్రామంలో వుండాలంటే తాము విధించే శిక్షను అనుభవించాలని షరతు పెట్టారు. ఇందులో భాగంగా.. రూ.26 వేల జరిమానాతో పాటు ఆమె నాలుకపై బంగారు తీగతో వాత పెట్టాలని, మళ్లీ ఇలాంటి తప్పు చేయకుండా గుండు గీసి గ్రామంలో ఊరేగించాలని నిర్ణయించారు. ఈ మేరకు అదే రోజు సాయంత్రం తీర్పును అమలు చేయాలని సూచించగా సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి వచ్చి యువతిని రక్షించారు. గ్రామ పెద్దలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments