Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో మాస్కులు ధరించని 67 వేల మందిపై కేసులు

Webdunia
గురువారం, 2 జులై 2020 (11:04 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ముఖానికి మాస్క్ ధరించడాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధం చేసింది. అయితే, అనేక మంది ఈ నిబంధనను పాటించడం లేదు. రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రమాదకరంగా పెరుగుతున్నా ముఖానికి మాస్కులు ధరించకుండా బహిరంగంగా చక్కర్లు కొడుతున్న 67,557 మందిపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. 
 
అలాగే, మరో 3,288 మందికి ఈ-చలానాలు జారీ చేసినట్టు చెప్పారు. 22 మార్చి నుంచి 30 జూన్ మధ్య ఈ కేసులు నమోదైనట్టు తెలిపారు. ముఖానికి మాస్కులు ధరించకుండా బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ నగర పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ దఫా కేసులు పెట్టడమే కాదు జైలుకు కూడా పంపుతామని హెచ్చరిస్తున్నారు. 
 
ఇక, రాజధాని హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 14,931 కేసులు నమోదు కాగా, రామగుండం కమిషనరేట్ పరిధిలో 8,290, ఖమ్మంలో 6,372, సూర్యాపేటలో 4,213, వరంగల్‌లో 3,907 మందిపై కేసులు నమోదు కాగా, అత్యల్పంగా భూపాలపల్లి జిల్లాలో 173 కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments