డబ్బు కోసం కన్నబిడ్డను అమ్ముకున్న తండ్రి.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 30 మే 2023 (16:53 IST)
డబ్బు కోసం కన్నబిడ్డను తండ్రే అమ్మేశాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో జరిగింది. దీనిపై బాలుడి మేనమామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 
 
కరీమాబాదా‌కు చెందిన మసూద్ అనే వ్యక్తి నాలుగేళ్ల కుమారుడు అయాన్‌ ఇటీవల ఉన్నట్టుండి కనిపించకుండా పోయాడు. పిల్లోడు కనపించక పోవడంతో ఇంట్లోని వారంతా ఆందోళన చెందుతున్నారు. కానీ, పిల్లోడి తండ్రి మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదు. ముఖ్యంగా బిడ్డ కనిపించకపోవడంతో తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. భర్త పట్టించుకోకపోవడంతో తన సోదరుడికి చెప్పుకుని ఏడ్చింది. 
 
దీంతో అక్క ఇంటికి వచ్చిన అక్బర్.. తన బావ ప్రవర్తనను అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. మసూద్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా తన బిడ్డను అమ్మలేదని, పోచమ్మ మైదాన్‌లో ఉంటున్న తమ బంధువులకు పెంచుకునేందుకు ఇచ్చానని వెల్లడించాడు.
 
అయితే, అతని మాటల్లో వాస్తవమెంతో తేల్చేందుకు పోలీసులు విచారణ జరుపుతున్నారు. బంధువులకు పెంచుకోవడానికి బిడ్డను ఇస్తే, ఇంట్లో వారికి, భార్యకు తెలియకుండా చేయాల్సిన అవసరం ఏమిటని పోలీసులతో పాటు ఫిర్యాదుదారుడు సందేహిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

IMAXలో స్టార్ట్ అవతార్ హంగామా - భారీగా అడ్వాన్స్ బుకింగ్స్

భూత శుద్ధి వివాహ బంధంతో ఒక్కటైన సమంత - రాజ్ నిడిమోరు

Kandula Durgesh: ఏపీలో కొత్త ఫిల్మ్ టూరిజం పాలసీ, త్వరలో నంది అవార్లులు : కందుల దుర్గేష్

Ram Achanta : అఖండ 2 నిర్మించడానికి గట్టి పోటీనే ఎదుర్కొన్నాం : రామ్, గోపీచంద్ ఆచంట

Bhumika Chawla: యూత్ డ్రగ్స్ మహమ్మారి బ్యాక్ డ్రాప్ తో యుఫోరియా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments