Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నతండ్రి కాదు.. కసాయి తండ్రి.. కుమార్తెల గొంతు కోశాడు..?

Webdunia
శనివారం, 7 నవంబరు 2020 (14:56 IST)
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో దారుణం జరిగింది. ఓ తండ్రి తన కుమార్తెల పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. ఇద్దరు కుమార్తెల గొంతు కోశాడు తండ్రి. దీన్ని గమనించిన స్థానికులు.. తక్షణమే పోలీసులకు సమాచారం అందించి.. ఇద్దరి పిల్లల ప్రాణాలు కాపాడారు. 
 
వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర నాందేడ్‌కు చెందిన ఎండీ మహమ్మద్ 15 సంవత్సరాల క్రితం మిర్‌దొడ్డి మండలంలోని మోతే గ్రామానికి వలసొచ్చాడు. మోతే గ్రామంలో మాంసం విక్రయిస్తూ జీవనోపాధి కొనసాగిస్తున్నాడు. 
 
అయితే శుక్రవారం రోజు దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన గుంజేడు సాయిలు ఇంట్లో మహమ్మద్ అద్దెకు దిగాడు. శనివారం ఉదయమే పీకల దాకా మద్యం సేవించిన మహమ్మద్‌.. ఆ మత్తులో తన ఇద్దరు కుమార్తెలను ఇంట్లో బంధించి.. చంపేస్తానని బెదిరించాడు. 
 
విషయం తెలుసుకున్న స్థానికులు భూంపల్లి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పిల్లలను చికిత్స నిమిత్తం సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments