Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూమికి పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వలేదనీ.. తండ్రీకొడుకులు...

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (13:59 IST)
రెవెన్యూ అధికారులు తమ భూమికి పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన తండ్రీ కొడుకులు జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యాయత్నినికి పాల్పడ్డారు. దీంతో అక్కడ ఉద్రికత వాతావరణం నెలకొంది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని ఆలేరు మండలం, కొలనుపాక గ్రామానికి చెందిన ఉప్పలయ్య అనే వ్యక్తికి 4 ఎకరాల భూమివుంది. ఈ భూమిని 20 యేళ్ల క్రితం 6 వేల రూపాయలకు కొనుగోలు చేశారు. అయితే, అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ భూమి పట్టాదారు పాస్ పుస్తకం కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ ఉప్పలయ్య ఆయన కుమారుడు మహేష్‌లు తిరుగుతూనే ఉన్నారు. 
 
కానీ, వారు ఏమాత్రం కనికరించ లేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఉప్పలయ్య, ఆయన కుమారుడు మహేష్‌లు తమ వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. అయితే, ఆ సమయంలో అక్కడున్నవారు అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమచారం తెలుసుకున్న అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆ ఇద్దరిని పిలిచి మాట్లాడి.. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments