Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూమికి పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వలేదనీ.. తండ్రీకొడుకులు...

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (13:59 IST)
రెవెన్యూ అధికారులు తమ భూమికి పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన తండ్రీ కొడుకులు జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యాయత్నినికి పాల్పడ్డారు. దీంతో అక్కడ ఉద్రికత వాతావరణం నెలకొంది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని ఆలేరు మండలం, కొలనుపాక గ్రామానికి చెందిన ఉప్పలయ్య అనే వ్యక్తికి 4 ఎకరాల భూమివుంది. ఈ భూమిని 20 యేళ్ల క్రితం 6 వేల రూపాయలకు కొనుగోలు చేశారు. అయితే, అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ భూమి పట్టాదారు పాస్ పుస్తకం కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ ఉప్పలయ్య ఆయన కుమారుడు మహేష్‌లు తిరుగుతూనే ఉన్నారు. 
 
కానీ, వారు ఏమాత్రం కనికరించ లేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఉప్పలయ్య, ఆయన కుమారుడు మహేష్‌లు తమ వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. అయితే, ఆ సమయంలో అక్కడున్నవారు అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమచారం తెలుసుకున్న అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆ ఇద్దరిని పిలిచి మాట్లాడి.. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments