గచ్చిబౌలిలో నకిలీ బాబా గుట్టు రట్టు: ఎంబీబీఎస్ పాస్ చేయిస్తానని..?

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (13:33 IST)
గచ్చిబౌలిలో నకిలీ బాబా గుట్టు రట్టు అయ్యింది. గచ్చిబౌలిలో పూజలు చేసి ఎంబీబీఎస్ పాస్ చేయిస్తానని నకలీ బాబా యువతిని మోసం చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశ్వజిత్ జా అనే బాబా కాలభైరవ పూజతో ఎంబీబీఎస్ పాస్ చేయిస్తానని యువతిని నమ్మబలికాడు. 
 
ఫేస్ బుక్ ద్వారా యువతితో విశ్వజిత్ బాబా పరిచయం పెంచుకున్నాడు. ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎక్సమినేషన్ పాస్ చేయిస్తానని చెప్పడంతో యువతి బాబాను నమ్మింది.
 
కాల భైరవ పూజ చేసి తన శక్తుల ద్వారా ఎంబీబీఎస్ పాస్ చేయిస్తానని చెప్పడంతో యువతి బాబాను పూర్తిగా నమ్మింది. అనంతరం విడతలవారీగా 80 వేల నగదును దొంగ బాబా తన అకౌంట్లో జమ చేయించుకున్నాడు. 
 
అనంతరం బాబాను సంప్రదించేందుకు అనేక మార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దాంతో మోసమోయనని తెలుసుకుని యువతి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments