బస్తీమే సవాల్ : నా గురించి మాట్లాడే అర్హత హరీష్‌కు లేదు.. ఈటల

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (15:40 IST)
మాజీ మంత్రి, తెరాస మాజీ నేత ఈటల రాజేందర్ బహిరంగ సవాల్ విసిరారు. తెరాస సీనియర్ నేత, మంత్రి, ఆ పార్టీ కీలక నేత అయిన మంత్రి హరీష్ రావుకు ఈ ఛాలెంజ్ విసిరారు. తన గురించి అబద్ధపు మాటలు చెప్పి హుజూరాబాద్ ప్రజలను నమ్మించే ప్రయత్నాన్ని హరీశ్ చేశారని మండిపడ్డారు. హరీశ్ వి మోసపు మాటలనే విషయం ఇక్కడి ప్రజలకు తెలుసని... ఇక్కడి ప్రజల ప్రేమను పొంది, వరుసగా గెలుస్తున్న వ్యక్తిని తానని చెప్పారు.
 
తెరాసలో చేరడానికి ముందు తనకున్న ఆస్తులు, ఇప్పుడున్న ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణకు తాను సిద్ధమని అన్నారు. 2001లో హరీశ్ రావుకు ఉన్న ఆస్తులు, ఇప్పుడు ఉన్న ఆస్తులపై విచారణకు ఆయన సిద్ధమా? అని బహిరంగంగా సవాల్ విసిరారు. ఈ విషయంపై అబిడ్స్‌లో బహిరంగ చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు.
 
ఎమ్మెల్యేకాకుండానే మంత్రి అయిన హరీశ్‌కు తన గురించి మాట్లాడే అర్హత కూడా లేదని ఈటల మండిపడ్డారు. హుజూరాబాద్‌లో ఈటల తప్పుడు ప్రచారం చేస్తున్నారని... దుబ్బాక ఎన్నికలో కూడా ఇలాంటి మోసపూరిత మాటలు చెప్పిన హరీశ్‌కు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని ఈటల చురకలంటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అతని కోసం పెద్ది చిత్రంలో నటించాలని నిర్ణయం తీసుకున్నా : దివ్యేందు శర్మ

M.M. Keeravani: లవ్ స్టోరీలో ఏడు పాటలు ఉంటాయంటే బ్లాక్ బస్టర్ : ఎంఎం కీరవాణి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments