ఇటీవల కాషాయం కండువా కప్పుకున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాదయాత్ర చేపట్టనున్నారు. ఆయన సొంత నియోజక వర్గం హుజురాబాద్ లో జరగబోతున్న ఈ పాదయాత్ర  కమలాపూర్ మండలంలోని బత్తినివానిపల్లి నుంచి ప్రారంభిస్తున్నారు. 
 
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	బత్తినివానిపల్లిలోని ఆంజనేయుని దేవస్థానంలో సోమవారం ఉదయం 9:30 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన శనిగరం, మాదన్నపేట, గునిపర్తి, శ్రీరాములపేట, అంబల గ్రామాల్లో పాదయాత్ర చేయనున్నారు. రాత్రికి అంబల గ్రామంలో బస చేయనున్నారు. మొత్తం 23 రోజుల పాటు 270 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర జరగనుంది.
 
									
										
								
																	
	 
	కాగా, ఇటీవల తెరాసకు రాజీనామా చేసిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. దీంతో ఆయన ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన హుజురాబాద్ స్థానానికి జరిగే ఉపఎన్నికలను అటు తెరాస, ఇటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా, ఈ ఉప ఎన్నిక ఈటల రాజేందర్కు జీవన్మరణ సమస్యగా మారింది.