Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గృహనిర్భంధం

Webdunia
గురువారం, 10 ఫిబ్రవరి 2022 (11:19 IST)
తెలంగాణా రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అసెంబ్లీ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను ఆ రాష్ట్ర పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఆయన ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం తెరాస చేపట్టిన నిరసనల్లో పలుప్రాంతాల్లో గొడవలు జరిగాయి. 
 
మోడీకి వ్యతిరేకంగా తెరాస, తెరాసకు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు పోటాపోటీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం బీజేపీ మౌనదీక్షలకు పిలుపునిచ్చింది. అలాగే, తెరాస శ్రేణులు చేసిన దాడుల్లో బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. వీరిని పరామర్శించేందుకు ఈటల రాజేందర్ జనగామ బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. 
 
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. ఈటల రాజేందర్‌ను గృహనిర్భంధంలో ఉంచారు. దీంతో పోలీసులపై ఈటల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో అందరికీ సమాన హక్కులు ఉంటాయని గుర్తుచేశారు. నిరసనలు, బంద్‌లకు ఒక్క తెరాస పార్టీకే మాత్రమే అనుమతిస్తారా అని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments