తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని కొత్త కోర్టులు

Webdunia
శనివారం, 7 అక్టోబరు 2023 (14:59 IST)
తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని కొత్త కోర్టులు రానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో కొత్తగా 57 కోర్టులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 
 
మొత్తం 57 కోర్టులను మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదనపు జిల్లా, సెషన్స్‌ జడ్జి, సీనియర్‌ సివిల్‌ జడ్జి, జూనియర్‌ సివిల్‌ జడ్జి కేడర్లలో ఈ కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొంది. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్యతో పాటు కొత్త కేసుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. దీంతో ప్రస్తుతం ఉన్న కోర్టులపై కూడా పనిభారం పెరిగింది. 
 
ఈ విషయాన్ని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి కొత్త కోర్టులను మంజూరు చేసింది. ఇందులో భాగంగా కొత్తగా 57 కోర్టులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 
 
చిన్నారులపై నేరాల విచారణకు ప్రత్యేకంగా 10 కోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది. ఇందులో ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, సంగారెడ్డి, నల్గొండ, ఎల్బీనగర్, వరంగల్ ప్రాంతాలు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

Akhanda 2: అఖండ 2 క్రిస్ మస్ కు తాండవం చేస్తుందా ? దామోదర ప్రసాద్ ఏమన్నారంటే..

మణికంఠ తీసిన కొత్తపెళ్లికూతురు షార్ట్ ఫిలిం చాలా ఇష్టం : మెహర్ రమేష్

వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర ల పోలీస్ కంప్లెయింట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments