Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో సెలూన్లు, లాండ్రీలు, ధోబీఘాట్లకు విద్యుత్‌ ఉచితం

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (08:48 IST)
క్షౌరశాలలు (సెలూన్‌ షాపులు), లాండ్రీ షాపులు, ధోబీఘాట్లకు నెలకు 250 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా రజక సంఘాలు, నాయీ బ్రాహ్మణ సంఘాలు ఇప్పటికే చేసిన విజ్ఞప్తులను పరిశీలించి తక్షణమే జీవో జారీ చేయాల్సిందిగా ఆదేశించారు.

ఈ నిర్ణయం ఏప్రిల్‌ 1 నుంచే అమల్లోకి వచ్చినట్లు అందులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, బలహీనవర్గాల అభ్యున్నతే తమ ప్రభుత్వ లక్ష్యమని వారి సంక్షేమం కోసం ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.

తరతరాలుగా కులవృత్తిని ఆధారంగా చేసుకుని జీవనం కొనసాగిస్తున్న లక్షల మంది రజక, నాయీ బ్రాహ్మణ కుటుంబాలకు తాజా నిర్ణయంతో లబ్ధి చేకూరుతుందన్నారు. ఉచిత విద్యుత్తుతో యంత్రపరికరాలు వాడడం ద్వారా వారికి శారీరక శ్రమ తగ్గడమేకాక ఆర్థిక వెసులుబాటు కూడా కలుగుతుందని సీఎం తెలిపారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments