Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో సెప్టెంబర్‌ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (07:30 IST)
తెలంగాణలో సెప్టెంబర్‌ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభంకానున్నాయి. విద్యాసంస్థలు తెరవచ్చని వైద్య ఆరోగ్య శాఖ నివేదిక ఇచ్చింది. ప్రత్యక్ష తరగతులు ప్రారంభించేందుకు తెలంగాణ సర్కార్‌ అనుమతిచ్చింది.

అయితే విడతల వారీగా తరగతులను ప్రారంభించే యోచనలో విద్యాశాఖ ఉన్నట్లు తెలుస్తోంది. 8వ తరగతి నుంచి పీజీ వరకు ప్రత్యక్ష బోధన ప్రారంభించే అవకాశం ఉంది. తరగతిలో 20 మంది పిల్లలకు పైగా ఉంటే రెండు సెక్షన్‌లుగా విభజించాలని భావిస్తున్నారు.

వివిధ రాష్ట్రాల్లో పాఠశాలలు తెరిచేందుకు అమలు చేస్తున్న విధానాలపై కేస్ స్టడీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే స్కూళ్లు తెరిచేందుకు అనుమ‌తి ఇవ్వాలంటూ విద్యాశాఖ సీఎంఓకు ప్ర‌తిపాద‌న‌లు పంపింది.
 
అంతకుముందు పాఠశాలల పునఃప్రారంభంపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ అధికారులు హాజరయ్యారు.

హాస్టల్‌లో ఉండే విద్యార్థులకు కరోనా పాజిటివ్ వస్తే పరిస్థితి ఏంటి?.. గత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం ఆరా తీసినట్లు తెలుస్తోంది.

థర్డ్ వేవ్ నేపథ్యంలో పిల్లలను తల్లిదండ్రులు స్కూల్స్‌కు పంపిస్తారా? లేదా?.. వివిధ అంశాలపై ఉన్నతాధికారులతో కేసీఆర్ మంతనాలు జరిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments