Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ మంత్రికి నకిలీ ఈడీ నోటీసు పంపిన క్రిమినల్స్

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (12:55 IST)
తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఉన్న గంగుల కమలాకర్ రెడ్డికి కొందరు క్రిమినల్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) శాఖకు సంబంధించిన నకిలీ నోటీసును పంపించారు. ఇది కలకలం సృష్టించింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ఉన్నారు. ఈయనకు ఈడీ నోటీసుల పేరుతో నకిలీ లేఖలు వచ్చాయి. అందులో గంగుల సోదరుడిని అరెస్టు చేయనున్నట్టు ఉంది. 
 
ఈ విషయం ఈడీ దృష్టికి రావడంతో ఆ విభాగం అధికారులు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ నకిలీ నోటీసుకు సంబంధించి మంత్రి కమలాకర్‌ నుంచి ఫిర్యాదు అందాల్సివుందని తెలిపారు. 
 
మరోవైపు, మంత్రికి నకిలీ నోటీసులు పంపిన దుండగులు.. ఈడీతో మాట్లాడి, సెటిల్‌ చేస్తామంటూ ఓ వ్యక్తితో ఫోన్‌ చేయించడం గమనార్హం. ఇపుడు గుర్తు తెలియని వ్యక్తి ఆ నంబర్‌ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు సైబర్‌క్రైమ్స్‌ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

శివాజీ నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

చిత్రపురి కాలనీలో అవినీతి కేవలం ఆరోపణ మాత్రమే: సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనీల్‌

నాగ్.. దేవుడు ఇచ్చిన వరం - కొడుకు లేని లోటు తీర్చాడు : అశ్వనీదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments