Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇ-మెయిల్ పాస్‌వర్డ్‌లతో జర జాగ్రత్త... రూ.9 కోట్లు మాయం

Webdunia
గురువారం, 21 మార్చి 2019 (10:53 IST)
ఇమెయిల్‌ల వాడకం, ఆన్‌లైన్ నగదు బదిలీలు సర్వసాధారణమైపోతున్న నేటి తరుణంలో ఇమెయిల్ హ్యాక్‌ల ద్వారా కోట్ల రూపాయలు కొట్టేసిన సంఘటన హైదరాబాద్‌లో బుధవారంనాడు వెలుగు చూసింది.
 
వివరాలలోకి వెళ్తే... హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఇంజినీరింగ్‌ వస్తువులను తయారుచేసే ఓల్టాంపెక్స్‌.. తన ఉత్పత్తులను పశ్చిమ ఆఫ్రికాలోని మాలే దేశానికి చెందిన డైమండ్‌ సిమెంట్‌ సంస్థకు కొంతకాలంగా ఎగుమతి చేస్తోంది. వీటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలన్నీ ఇరు సంస్థల మధ్య ఆన్‌లైన్‌‌లో జరుగుతూ ఉండేవి. ఈ మేరకు ఓల్టాంపెక్స్‌ సంస్థకు చెందిన ఎస్సార్‌నగర్‌లోని ఓ బ్యాంకు ఖాతాకు ఆఫ్రికా నుంచి నగదు వస్తూండేది.

అయితే.. ఆయా లావాదేవీలపై కన్నేసిన సైబర్‌ నేరగాళ్లు బ్యాంక్ ఖాతాల వివరాలను తెలుసుకొని... ఓల్టాంప్లెక్స్‌ ఇమెయిల్‌ను హ్యాక్‌ చేసి డైమండ్‌ సిమెంట్స్‌ సంస్థకు అమెరికాకు చెందిన బ్యాంకు వివరాలను పంపారు. బ్యాంకు ఖాతా వివరాలు మారాయనీ... ఇకపై తాము పంపిన కొత్త ఖాతాకు నగదు బదిలీ చేయాలని మెయిల్‌లో పేర్కొన్నారు.

ఆమేరకు డైమండ్‌ సిమెంట్స్‌ 1,259,500 అమెరికన్‌ డాలర్లను(సుమారు రూ.9కోట్లు) కొత్త ఖాతాకు బదిలీ చేసింది. ఇంకా డబ్బు అందలేదని ఓల్టాంప్లెక్స్‌ ఆందోళనతో డైమండ్‌ సిమెంట్స్‌ ప్రతినిధులను ఫోన్‌ ద్వారా సంప్రదించగా అసలు మోసం వెలుగు చూసింది. కేసును  దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉందని పోలీసులు పేర్కొంటున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments