Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబ్బాక ఉప ఎన్నిక, చివరి క్షణంలో కరోనా బాధితులకు ఓటు వేసే అవకాశం

Webdunia
మంగళవారం, 3 నవంబరు 2020 (18:31 IST)
కోవిడ్ నిబంధనల నడుమ దుబ్బాక ఉప ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పంచాలనే ఉద్దేశంతో అధికారులు ఓ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా కరోనా బాధితులకు చివరి క్షణంలో ఓటు హక్కు కల్పించారు. సాధారణంగా ఓటింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుండగా ఆ తర్వాత ఆరు గంటల వరకు కరోనా బాధితులకు ఓటేసే అవకాశం కల్పించడం జరిగింది.
 
చివరి గంట పోలింగ్ కరోనా బాధితుల కోసం కేటాయించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాగా దుబ్బాకలో పోలింగ్ ప్రశాంతంగా జరిగందని, మధ్యాహ్నం 1గంట వరకు 55.52 శాతం ఓట్లు పోలవగా 3 గంటల సమయానికి 71.10 శాతం పోలింగ్ జరిగినట్లు సమాచారం. ఓటర్లు ఉత్సాహంగా తరలివచ్చి ఓట్లు వేయడంతో ఓటింగ్ శాతం పెరిగింది. దీంతో పోలింగ్ శాతం భారీగా నమోదయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments