Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్ర‌యంలో డ్రగ్స్.. విలువ రూ.53కోట్లు

Webdunia
ఆదివారం, 6 జూన్ 2021 (13:51 IST)
హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్ర‌యంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. వీటి విలువ రూ.53 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఓ మహిళపై అనుమానం వచ్చి తనిఖీలు నిర్వహించగా.. 8 కిలోల‌ హెరాయిన్‌ లభ్యమైనట్లు క‌స్ట‌మ్స్ అధికారులు తెలిపారు. వాటిని స్వాధీనం చేసుకోని విచారణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఆదివారం ఉదయం దోహా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కుల‌ వ‌చ్చిన మ‌హిళ వ‌ద్ద మాద‌క‌ద్ర‌వ్యాలు ఉన్న‌ట్లు అధికారులు గుర్తించారు. ఈ క్ర‌మంలో డీఆర్ఐ అధికారులు మ‌హిళ‌ను అదుపులోకి తీసుకుని తనిఖీలు నిర్వహించారు. నిందితురాలిని జాంబియాకు చెందిన ముకుంబా క‌రోల్‌గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
 
ఇదిలాఉంటే.. చెన్నై విమానాశ్రంలో కూడా 10కేజీల హెరాయిన్ లభ్యమైనట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. దీని విలువ రూ.73 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ మహిళ కూడా సౌత్ ఆఫ్రికాకు చెందిన మహిళగా అధికారులు తెలిపారు. అయితే.. ఇటు శంషాబాద్, అటు చెన్నైలో భారీగా హెరాయిన్ పట్టుబడటంతో డీఆర్ఐ అధికారులు అప్రమత్తమయ్యారు. వీరిద్దరికీ లింకు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. దీనిపై విచారణ జరుగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాణామతి బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న చిత్రం చేతబడి

Samantha: సమంత, రాజ్ కలిసి డిన్నర్ చేశారా? కారులో జతగా కనిపించారుగా! (video)

వార్ 2 లో హృతిక్ రోషన్, కియారా అద్వానీ లిప్ కిస్ ల రొమాంటిక్ సాంగ్

Kingdom Review: కింగ్ డమ్ తో విజయ్ దేవరకొండ కు సక్సెసా ! కాదా ! - కింగ్ డమ్ రివ్యూ

హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి గౌతమి కశ్యప్ అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments