ఐఎస్‌బి గగనతలంపై డ్రోన్ల నిషేధం : సీవీ ఆనంద్ హెచ్చరిక

Webdunia
మంగళవారం, 24 మే 2022 (19:24 IST)
ఈ నెల 26వ తేదీ గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ నగర పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బి)‌ను సందర్శించనున్నారు. ప్రధాని పర్యటనను పురస్కరించుకుని ఈ క్యాంపస్ గగనతలంపై రిమోట్ కంట్రోల్డ్ డ్రోన్స్, పారా గ్లైడర్స్, రిమోట్ కంట్రోల్డ్ మైక్రో లైట్ ఎయిర్‌క్రాఫ్ట్స్‌లు ఎగురవేయడాన్ని నిషేధించారు. 
 
ఐఎస్‌బి క్యాంపస్ ఉండే ఐదు కిలోమీటర్ల పరిసర ప్రాంతాల్లో ఎలాంటి డ్రోన్లు ఎగురవేయడానికి వీల్లేకుండా నిషేధం విధించారు. ఈ నిషేధాజ్ఞలు ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 26వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అమల్లో ఉండనుంది.
 
ఈ మేరకు హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీచేశారు. ఈ అదేశాలు ఉల్లంఘించే వారిపై ఐపీసీ 188, సెక్షన్ 121, 121 (A), 287, 336, 338 సెక్షన్ల కింద చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments