Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ మంత్రి డీకే అరుణ కుమార్తెకు సైబర్ నేరగాళ్ల కుచ్చుటోపీ

Webdunia
శుక్రవారం, 7 జులై 2023 (16:18 IST)
తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీనియర్ మహిళా నేత, మాజీ మంత్రి డీకే అరుణ కుమార్తె డీకే శృతి రెడ్డికి సైబర్ నేరగాళ్ల పేరుతో మాజీ కారు డ్రైవర్ కుచ్చుటోపీ పెట్టాడు. ఆమె వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్న వ్యక్తి క్రెడిట్ కార్డును చోరీ చేసి లక్షల రూపాయల మేరకు కొల్లగొట్టేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ నగరంలోని బంజార్ హిల్స్‌ రోడ్ నెంబర్ 14లోని ప్రేమ్ పర్వత్ విల్లాస్‌లో ఉంటున్నారు. ఆమె వద్ద గత డిసెంబర్ నుంచి బీసన్న అనే వ్యక్తి కారు డ్రైవరుగా పని చేస్తున్నారు. ఇటీవల శృతి రెడ్డికి చెందిన క్రెడిట్ కార్డును దొంగిలించాడు. ఆ కార్డుతో శ్రీ మహావీర్ జెమ్స్ అండ్ పెరల్స్‌లో స్వైప్ చేసి రూ.11 లక్షల వరకు ఖర్చు చేశాడు. ఈ విషయాన్ని శృతి రెడ్డి ఆలస్యంగా గుర్తించారు. 
 
ఆ తర్వాత బీసన్నపై అనుమానంతో ఆయన్ను నిలదీయగా, తాను చోరీ చేయలేదని బుకాయించాడు. దీంతో డ్రైవర్‌పై ఆమె బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో బీసన్నపై ఐపీసీ 420, 408 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టామ్ క్రూయిస్ మిషన్: ఇంపాజిబుల్ - భారతదేశంలో 6 రోజుల ముందుగా విడుదల

కలియుగమ్ 2064 ట్రైలర్, మోడరన్ కైండ్ ఆఫ్ బుక్ లా వుంది : రాంగోపాల్ వర్మ

అభిమన్యు సింగ్ నటించిన సూర్యాపేట జంక్షన్ చిత్రం రివ్యూ

అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉంటాడు... రాహుల్ రవీంద్రన్‍తో బంధంపై సమంత

హీరో ప్రభాస్.. ఒక సాదాసీదా నటుడు మాత్రమే... లెజెండ్ కాదు..: మంచు విష్ణు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

తర్వాతి కథనం
Show comments