Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరకట్న వేధింపులు... ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకిన మహిళ

Webdunia
శుక్రవారం, 14 డిశెంబరు 2018 (13:29 IST)
వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన నందిగామ దేవమ్మ తన ఇద్దరు పిల్లలతో సమీపంలోని పాడుబడ్డ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. కరణ్ కోర్టు రూరల్ సిఐ ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం మల్కపూర్ గ్రామానికి చెందిన నందిగామ దేవమ్మ భర్త నందిగామా వెంకటేశులు గత నాలుగు సంవత్సరాల క్రితం కోట పిసిపల్లి గ్రామానికి చెందిన వడ్డే శాంతమ్మ కూతురితో వివాహం జరిగింది. 
 
నాలుగేళ్లపాటు కాపురం సాఫీగా కొనసాగినప్పటికీ వరకట్నం కింద తనకు కొంత డబ్బు తీసుకురావాలంటూ వేధించడం మొదలుపెట్టాడు. దీంతో వేధింపులు తాళలేక తల్లి, ఇద్దరు కూతుళ్లతో కలిసి బావిలో దూకింది. ఇది గమనించిన స్థానికులు బావిలోకి దూకి రెండు సంవత్సరాల రాజేశ్వరి అనే పాపను రక్షించారు. చిన్న పాప, తల్లి ఇద్దరు మృతి చెందినట్లు తెలిపారు.
 
వరకట్న వేధింపులతోనే తన కూతురు దేవమ్మ చిన్న పిల్లలతో ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి శాంతమ్మ కరణ్ కోట పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కూతురు, చిన్నారి మరణానికి కారణమైన వెంకటేశ్‌ను ఆయన కుటుంబ సభ్యులను కఠిన శిక్షించాలని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కరణ్ కోట్ ఎస్ఐ సంతోష్ కుమార్, సిఐ ఉపేందర్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments