Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరకట్న వేధింపులు... ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకిన మహిళ

Webdunia
శుక్రవారం, 14 డిశెంబరు 2018 (13:29 IST)
వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన నందిగామ దేవమ్మ తన ఇద్దరు పిల్లలతో సమీపంలోని పాడుబడ్డ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. కరణ్ కోర్టు రూరల్ సిఐ ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం మల్కపూర్ గ్రామానికి చెందిన నందిగామ దేవమ్మ భర్త నందిగామా వెంకటేశులు గత నాలుగు సంవత్సరాల క్రితం కోట పిసిపల్లి గ్రామానికి చెందిన వడ్డే శాంతమ్మ కూతురితో వివాహం జరిగింది. 
 
నాలుగేళ్లపాటు కాపురం సాఫీగా కొనసాగినప్పటికీ వరకట్నం కింద తనకు కొంత డబ్బు తీసుకురావాలంటూ వేధించడం మొదలుపెట్టాడు. దీంతో వేధింపులు తాళలేక తల్లి, ఇద్దరు కూతుళ్లతో కలిసి బావిలో దూకింది. ఇది గమనించిన స్థానికులు బావిలోకి దూకి రెండు సంవత్సరాల రాజేశ్వరి అనే పాపను రక్షించారు. చిన్న పాప, తల్లి ఇద్దరు మృతి చెందినట్లు తెలిపారు.
 
వరకట్న వేధింపులతోనే తన కూతురు దేవమ్మ చిన్న పిల్లలతో ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి శాంతమ్మ కరణ్ కోట పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కూతురు, చిన్నారి మరణానికి కారణమైన వెంకటేశ్‌ను ఆయన కుటుంబ సభ్యులను కఠిన శిక్షించాలని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కరణ్ కోట్ ఎస్ఐ సంతోష్ కుమార్, సిఐ ఉపేందర్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments