Webdunia - Bharat's app for daily news and videos

Install App

పక్కింటి కుర్రాడితో మాట్లాడిన భార్య... నరికి చంపేసిన భర్త..?

Webdunia
సోమవారం, 5 ఆగస్టు 2019 (15:03 IST)
అనుమానం పెనుభూతమైంది. కట్టుకున్న భార్య పక్కింటి కుర్రాడితో మాట్లాడుతోందని, అతనితో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానించిన భర్త ఆమెను అతికిరాతకంగా చంపేశాడు. భార్యతో పాటు కొడుకు, కూతుర్ని కూడా అతి దారుణంగా నరికి చంపి పరారయ్యాడు.
 
వికారాబాద్‌కు చెందిన ప్రవీణ్ కుమార్‌కు , అదే ప్రాంతానికి చెందిన చాందిని 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరిది ప్రేమ వివాహం. ప్రవీణ్ హిందువు... చాందిని ముస్లిం. ఇద్దరూ ప్రేమించి ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్ళి చేసుకున్నారు. వేరు కాపురం పెట్టారు. 15 సంవత్సరాలు బాగానే వీరి కాపురం సాగింది. అయితే గత కొన్నిరోజులుగా తన ఇంటి పక్కనే ఉన్న 18 యేళ్ళ యువకుడితో తన భార్య చాందిని సన్నిహితంగా ఉందని అనుమానించాడు ప్రవీణ్. 
 
ఇదే విషయంపై గత మూడురోజుల నుంచి భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతోంది. ఈ రోజు ఉదయం 9 గంటలకు భార్యాభర్తల మధ్య గొడవ పెద్దదైంది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ప్రవీణ్ కుమార్ ఇంట్లో ఉన్న కత్తితో అతి దారుణంగా భార్యను మొదటగా చంపాడు. ఆ తరువాత ఇద్దరు పిల్లలను కూడా నరికి చంపేశాడు. 
 
కొద్దిసేపటి తరువాత ఇంటి నుంచి పరారయ్యాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ముగ్గురి హత్యలతో ఒక్కసారిగా వికారాబాద్ ప్రాంతం ఉలిక్కిపడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments