Webdunia - Bharat's app for daily news and videos

Install App

సహోద్యోగినితో సన్నిహితంగా ఫోన్ సంభాషణ... పిల్లలకి విషమిచ్చి తాగేసింది....

Webdunia
గురువారం, 14 ఫిబ్రవరి 2019 (16:00 IST)
భర్తపై అనుమానంతో ఓ మహిళ తాను ఆత్మహత్య చేసుకోవాడానికి ప్రయత్నించడమే కాకుండా పిల్లలకు కూడా విషం పెట్టింది. వారిలో కూతురు మరణించగా తల్లీకొడుకుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. ఈ విషాద సంఘటన బుధవారం మియాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. 
 
మియాపూర్‌ సీఐ వెంకటేష్‌, ఎస్‌ఐ శ్రీరాంరెడ్డి చెప్పిన వివరాల ప్రకారం కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా మధుగిరి తాలూకా చందబావి గ్రామానికి చెందిన సురేశ్, సుమ అనే దంపతులు రెండు సంవత్సరాల నుండి మియాపూర్ లక్ష్మీనగర్‌లో నివాసం ఉంటున్నారు. సురేశ్ బాచుపల్లిలోని ఓ ఫార్మా కంపెనీలో ఏవోగా పనిచేస్తున్నాడు. వారికి హర్షిత (5). హర్ష (5) కవల పిల్లలు ఉన్నారు. 
 
బుధవారం సాయంత్రం సురేశ్ ఆఫీసు నుండి ఇంటికి వచ్చాడు. అక్కడ భార్యాపిల్లలు అపస్మారక స్థితిలో ఉండటంతో వెంటనే 108కి ఫోన్ చేశాడు. కాసేపటికి 108 సిబ్బంది వచ్చి బాధితులకు ప్రాథమిక చికిత్స అందించి సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వారిలో హర్షిత మృతి చెందగా, హర్ష, సుమల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. గుర్తుతెలియని విషం తీసుకున్నందువల్లే ఇలా జరిగిందని చెప్పారు. పిల్లలు ఇద్దరూ స్థానికంగా ఉన్న పాఠశాలలో యూకేజీ చదువుకుంటున్నారు. 
 
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అన్యోన్యంగా ఉన్న దాంపత్యంతో ఇటీవల చోటుచేసుకున్న కలహాలే ఈ దారుణానికి కారణం అని కాలనీవాసులు పోలీసులు అభిప్రాయపడుతున్నారు. భర్త తను పనిచేసే కంపెనీలో సహోద్యోగితో చనువుగా ఉండటం, తరచూ ఫోన్‌లలో సంభాషించుకోవడం వలనే ఈ కలహాలు వచ్చాయని సమాచారం. సహోద్యోగులు, బంధువుల నుండి పూర్తి వివరాలు సేకరించి దర్యాప్తు కొనసాగిస్తామని పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments