కాంగ్రెస్‌ కు వెన్నుపోటు పొడవకండి: మధుయాస్కీ

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (08:00 IST)
"కాంగ్రెస్‌ నుంచి బయటకు వెళ్లాలనుకునేవారు వెళ్లొచ్చు.. కానీ పార్టీలో ఉంటూ వెన్నుపోటు మాత్రం పొడవకండి" అని పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీగౌడ్‌ కోరారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎదుగుదలైనా, తన ఉన్నతైనా పార్టీ అధినేత్రి సోనియాగాంధీ వల్లే అన్నారు.

వైఎస్‌ విజయమ్మ నిర్వహించింది ఆత్మీయ సమ్మేళనం కాదని.. అది రాజకీయ సమ్మేళనం అని విమర్శించారు. ఆ సమ్మేళనానికి వెళ్లొద్దని పార్టీ నుంచి ఆదేశాలు వెళ్లినా కొంతమంది హాజరయ్యారన్నారు.

ఆ ఆదేశాలను పట్టించుకోకుండా కాంగ్రెస్‌ను వ్యతిరేకించే రాజకీయ వేదిక మీదకు వెళ్లి మాట్లాడటం ద్వారా పార్టీకి నష్టమే జరుగుతుందన్నారు. కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోవాలా?, వద్దా? అనేది అధిష్ఠానం చూసుకుంటుందన్నారు.

వైఎస్సార్‌ బతికుంటే తెలంగాణ ఏర్పడేదే కాదని విజయమ్మ చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థిస్తారా? అని మధుయాస్కీ ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిల్లీ పర్యటనలో ప్రధాని మోదీకి ఇచ్చిన వినతులు విభజన చట్టంలోనే ఉన్నాయని.. వాటిని ఏడేళ్లు ఎందుకు మర్చిపోయారని మధుయాస్కీగౌడ్‌ నిలదీశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments