Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిశ హత్య కేసు: నాలుగో నిందితుడిని చెడగొట్టిన మొదటి నిందితుడు

Webdunia
బుధవారం, 4 డిశెంబరు 2019 (20:21 IST)
దిశ అత్యాచారం, హత్య తర్వాత దేశవ్యాప్తంగా నిందితుల పూర్తి వివరాల గురించి వారి కుటుంబం గురించి తెలుసుకునేందుకు మీడియా ప్రయత్నం చేస్తూ వుంది. అంత దారుణంగా నిందితులు ఎలా మారారు, వాళ్ల కుటుంబ నేపధ్యం ఏంటి అని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో నాలుగో నిందితుడు ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నట్లు అతడి కుటుంబ సభ్యులు వెల్లడించారు.
 
వారి మాటల్లోనే... అతడికి కిడ్నీ సమస్య వుంది. మాకు తెలిసి మా అబ్బాయి కోసం ఇంటి ముందుకు ఎవరు రారు. అంతా ఫోన్ ద్వారానే జరుగుతుంది. ఫోన్ చేసి తీసుకుని వెళతారు. అతడికి కిడ్నీ సమస్య వుండటంతో తింటాడు ఇంట్లోనే వుంటాడు. మేమంతా అతడిని కూలీ పని చేసి పోషిస్తున్నాం.
 
మాకు తెలిసి వాడికి అసుమంటి చేష్టలు లేవు. మొదటి నిందితుడే మావాడిని చెడగొట్టిండు. తాగిన మైకంలో ఏం చేశాడో తెలియదు అని అతడి తల్లి వెల్లడించారు. నిందితుడిని ఎనిమిది నెలల క్రితం వివాహం చేసుకున్న యువతి మాట్లాడుతూ.. అతడికి అసుమంటి చేష్టలు లేవు. ఉంటే నేనెందుకు పెళ్లాడుతా. కిడ్నీ ట్రబుల్ బెడ్ రెస్ట్ అని డాక్టర్లు చెప్పిండ్రు. అంతే, అప్పట్నుంచి అతడిని ఇంట్లోనే వుండమన్నాం. 
 
మొదటి నిందితుడు మధ్యాహ్నం లేపుకుని వెళ్లిండంట. లోడ్ వచ్చింది, పైసలు తీసుకెళ్దువ్ రా అని తీసుకెళ్లిండ్రు అంతే, నా భర్త తప్పు చేసిండు అని నిరూపణ అయితే నలుగురితో పాటు నా భర్తను ఉరి తీయండి. మా బతుకుదెరువు గింతె జూడు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments