తెలంగాణలో ఎక్కువ మార్కులొచ్చినా ఉద్యోగమేదీ?

Webdunia
గురువారం, 26 సెప్టెంబరు 2019 (07:36 IST)
కానిస్టేబుల్ ఫలితాలపై కొంతమంది అభ్యర్థులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థుల కంటే ఎక్కువ మార్కులు వచ్చినా... తమ పేరు జాబితాలో లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కానిస్టేబుల్​ ఫలితాల్లో ఏదో గందరగోళం నెలకొందని అభ్యర్థులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగం వచ్చిన వారికంటే ఎక్కువ మార్కులొచ్చినా... తమ పేరు జాబితాలో లేదని ఆవేదన చెందుతున్నారు.

ఉద్యోగం రాని వివిధ జిల్లాలకు చెందిన కొంతమంది అభ్యర్థులు లక్డీకపూల్​లోని డీజీపీ కార్యాలయానికి చేరుకున్నారు. పోలీస్ నియామక మండలి ఛైర్మన్ శ్రీనివాస్ రావును కలిసేందుకు ప్రయత్నించారు. కానీ అనుమతి లేకపోవడం వల్ల హెల్ప్ లైన్ కేంద్రంలో ఉన్న అధికారులను కలిసి సమస్యలను విన్నవించారు.

సందేహాలున్న అభ్యర్థులు.... పోలీస్ నియామక మండలి వెబ్ సైట్​లో నిర్ణీత రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకుంటే.... రెండు నుంచి మూడువారాల్లో సమాధానమిస్తామని పోలీస్ నియామక మండలి ఛైర్మన్ వి.శ్రీనివాస్ రావు తెలిపారు.

ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రదర్శించకుండా.. కేవలం వారి వారి వ్యక్తిగత లాగిన్​లలోనే వివరాలు పొందుపర్చడం వల్ల పారదర్శకత లోపించిందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kamalhasan: కమల్ హాసన్ చిత్రం సెయాన్ లో శివకార్తికేయన్ ఫస్ట్ లుక్

ధర్మస్థల నియోజకవర్గం లో డ్యాన్సర్ శ్రష్టి వర్మ సింగిల్

Nagabandham teaser: పాన్ ఇండియా టాప్ ట్రెండింగ్‌లో నాగబంధం టీజర్

Sunil: కాటాలన్ ఐటెం నంబర్‌లో అదరగొట్టిన సునీల్

త్రిషపై బీజేపీ నేత ఫైర్- అలాంటి వ్యాఖ్యలు అసహ్యకరమైనవి... లాయర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

ప్రేమకు సరికొత్త భాష: శ్రద్ధను, ఉద్దేశాన్ని చాటిచెప్పే వాలెంటైన్స్ డే బహుమతులు

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

మొలలు లేదా పైల్స్ వున్నవారు తినకూడని పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments