Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో ఎక్కువ మార్కులొచ్చినా ఉద్యోగమేదీ?

Webdunia
గురువారం, 26 సెప్టెంబరు 2019 (07:36 IST)
కానిస్టేబుల్ ఫలితాలపై కొంతమంది అభ్యర్థులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థుల కంటే ఎక్కువ మార్కులు వచ్చినా... తమ పేరు జాబితాలో లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కానిస్టేబుల్​ ఫలితాల్లో ఏదో గందరగోళం నెలకొందని అభ్యర్థులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగం వచ్చిన వారికంటే ఎక్కువ మార్కులొచ్చినా... తమ పేరు జాబితాలో లేదని ఆవేదన చెందుతున్నారు.

ఉద్యోగం రాని వివిధ జిల్లాలకు చెందిన కొంతమంది అభ్యర్థులు లక్డీకపూల్​లోని డీజీపీ కార్యాలయానికి చేరుకున్నారు. పోలీస్ నియామక మండలి ఛైర్మన్ శ్రీనివాస్ రావును కలిసేందుకు ప్రయత్నించారు. కానీ అనుమతి లేకపోవడం వల్ల హెల్ప్ లైన్ కేంద్రంలో ఉన్న అధికారులను కలిసి సమస్యలను విన్నవించారు.

సందేహాలున్న అభ్యర్థులు.... పోలీస్ నియామక మండలి వెబ్ సైట్​లో నిర్ణీత రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకుంటే.... రెండు నుంచి మూడువారాల్లో సమాధానమిస్తామని పోలీస్ నియామక మండలి ఛైర్మన్ వి.శ్రీనివాస్ రావు తెలిపారు.

ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రదర్శించకుండా.. కేవలం వారి వారి వ్యక్తిగత లాగిన్​లలోనే వివరాలు పొందుపర్చడం వల్ల పారదర్శకత లోపించిందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments