Webdunia - Bharat's app for daily news and videos

Install App

దళితబంధు కేవలం కార్యక్రమం కాదని.. ఉద్యమం : సీఎం కేసీఆర్

Webdunia
సోమవారం, 26 జులై 2021 (13:45 IST)
దళితబంధు కేవలం ఒక పథకం కాదనీ ఓ ఉద్యమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అందువల్ల హుజూరాబాద్లో దళితబంధు పథకం విజయవంతం చేయాలని సూచించారు. 
 
హుజూరాబాద్ నియోజకవర్గ ఎస్సీ ప్రతినిధులతో సోమవారం సమావేశమైన సీఎం కేసీఆర్, ఈ పథకం లక్ష్యాలు, అమలు, కార్యాచరణపై వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా దళితబంధు కేవలం కార్యక్రమం కాదని.. ఉద్యమమని ఆయన వ్యాఖ్యానించారు. 
 
ఈ పథకం అమలు ప్రభావం యావత్ తెలంగాణపై ఆధారపడి ఉంటుందన్నారు. పథకం విజయవంతానికి అందరూ దృఢ నిర్ణయం తీసుకోవాలని కోరారు. తెలంగాణ ఉద్యమం ఒక్కడితో ప్రారంభమైందన్న సీఎం.. భారత రాజకీయ వ్యవస్థపై ఒత్తిడి తెచ్చి విజయం సాధించామన్నారు. 
 
నమ్మిన ధర్మానికి కట్టుబడి కొనసాగితేనే విజయం సాధ్యమన్నారు. మనిషిని మనిషి వివక్ష చూపే దుస్థితిపై అధ్యయనం చేశానన్న కేసీఆర్.. మనలో పరస్పర విశ్వాసం, సహకారం పెరగాలని సూచించారు. పరస్పర సౌభ్రాతృత్వం పెంచుకుంటేనే విజయానికి బాటలు వేయొచ్చని హితవు పలికారు. 
 
హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రతి మున్సిపాలిటీలోని ఒక్కో వార్డు నుంచి ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళల చొప్పున మొత్తం 412 మంది ఎస్సీ పురుషులు, మహిళలు సదస్సులో పాల్గొన్నారు. వీరితోపాటు మరో 15 మంది రిసోర్స్‌పర్సన్లు ఇలా.. మొత్తం 427 మంది ప్రగతిభవన్‌కు చేరుకుని ఈ సమీక్షలో పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments