తెలంగాణ... వ్యక్తిని పొట్టన బెట్టుకున్న మొసలి

Webdunia
సోమవారం, 1 మార్చి 2021 (09:38 IST)
తెలంగాణలో దారుణం చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ఇసోజి పేటలో ఒక వ్యక్తిని మొసలి పొట్టన పెట్టుకుంది. పశువుల కాపరిగా పని చేస్తున్న రాములు అనే వ్యక్తి మీద మొసలి దాడి చేయడం సంచలనంగా మారింది. రాములుని నీళ్ళలోకి ఈడ్చుకు వెళ్ళిన మొసలి అతనిని చంపేసింది. పశువులు నీరు తాగించేందుకు వెళ్లిన రాములు మొసలికి బలైనట్టు చెబుతున్నారు.
 
అతని మీద మొసలి దాడి చేసినప్పుడు ఒడ్డు మీద ఉన్న ఇతర పశువుల కాపరులు తమ వద్ద ఉన్న కర్రలతో ఒడ్డు మీద నుంచే నీళ్లపై గట్టిగా కొడుతూ అరుపులు, కేకలు వేశారు. అయినా రాములుని మాత్రం మొసలి విడిచిపెట్టలేదని అంటున్నారు. అయితే కొద్దిసేపటి తర్వాత నీళ్లలో వెతగ్గా రాములు మృతదేహం లభించింది. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ఇసోజిపేట-కోడూరు గ్రామ శివారులోని మంజీరా నదిలో నిన్న ఈ ఘటన జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శర్వా బైకర్ నుంచి మోటివేషన్ యాంథమ్ జిద్ధి జిద్ధి రిలీజ్

Ajay Bhupathi: తిరుపతిలో శ్రీనివాస మంగాపురం మూడో కీలక షెడ్యూల్‌ పూర్తి

Manchu Manoj :డేవిడ్ రెడ్డి లో హీరోయిన్ గా మారియా ర్యాబోషాప్కా

Ranveer Singh: ధురంధర్ ది రివెంజ్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్

సింగపూర్‌కు చేరుకున్న డిస్నీ అడ్వెంచర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కౌమారదశ బాలికలకు పరిశుభ్రత కిట్ పంపిణీతో మహిళా దినోత్సవ ప్రభావాన్ని పెంచుతున్న క్వాలిజీల్

Benefits of Honey: తేనెతో బరువు మటాష్.. మహిళలకు దివ్యౌషధం

థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు

రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...

పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments