కరోనా మృతులు.. ఐదు రూపాయలకే దహన సంస్కారాలు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 24 మే 2021 (12:16 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా బారినపడి చనిపోయిన వారికి ఐదు రూపాయలకే దహన సంస్కారాలు నిర్వహించనున్నట్టు మంత్రి శ్రీనివాసగౌడ్ తెలిపారు. కరోనాతో మృతి చెందిన వారికి దహన సంస్కారాలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో మృతదేహాలను అలాగే వదిలేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్‌లో రెండు ఎకరాల స్థలంలో గ్యాస్ ఆధారిత శ్మశాన వాటికను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు.
 
త్వరలోనే శ్శశాన వాటిక పనులు పూర్తయి అందుబాటులోకి వస్తుందన్నారు. మునిసిపల్ కమిషనర్‌కు రూ. 5 చెల్లించడం ద్వారా అక్కడ అంత్యక్రియలు చేసుకోవచ్చన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్టు చెప్పారు.
 
తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టింది. పదివేలకు వరకు నమోదైన పాజిటివ్‌ కేసులు.. లాక్‌డౌన్‌లో ఒక్కసారిగా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గిపోయింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 2242 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, తాజాగా 19 మంది మృతి చెందినట్లు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 5,53,277కు చేరగా, మొత్తం మరణాల సంఖ్య 3,125కు చేరింది. తాజాగా రికవరీ కేసుల సంఖ్య 4693 ఉండగా, ఇప్పటి వరకు 5,09,663 రికవరీ కేసులు నమోదయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

గుర్రం పాపిరెడ్డి బోర్ కొట్టదు, అవతార్ రిలీజ్ మాకు పోటీ కాదు : డైరెక్టర్ మురళీ మనోహర్

మనల్ని విమర్శించే వారి తిట్ల నుంచే పాజిటివ్ ఎనర్జీని తీసుకుందాం. ఎదుగుదాం

హీరో కార్తి చిత్రం వా వాత్తియార్‌ రిలీజ్‌కు చిక్కులు - మద్రాస్ హైకోర్టు బ్రేక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

తర్వాతి కథనం
Show comments