Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో ఆర్టీసీ - విద్యుత్ చార్జీల బాదుడు తప్పదా?

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (09:48 IST)
కరోనా కష్టకాలంలో కోల్పోయిన ఆదాయాన్ని రాబట్టుకునేందుకు ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచాలని రవాణా శాఖ అధికారులు డిమాండ్ చేస్తున్నారు. పనిలోపనిగా విద్యుత్ చార్జీలు కూడా పెంచేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, ఆర్టీసీ, విద్యుత్ చార్జీల పెంపుపై తుది నిర్ణయాన్ని వచ్చే మంత్రిమండలి సమావేశంలో నిర్ణయిస్తామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. 
 
మంగళవారం ప్రగతిభవన్‌లో ఆర్టీసీ, విద్యుత్‌ సంస్థల సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌, జగదీశ్‌రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమీక్షలో ఆర్టీసీ, విద్యుత్‌ ఛార్జీల పెంపుపై ప్రధానంగా చర్చించారు. 
 
జరిగిన సమీక్షలో విద్యుత్‌ సంస్థలు, ఆర్టీసీ ఎదుర్కొంటున్న సమస్యల్ని మంత్రులు, అధికారులు... ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఛార్జీల పెంపు కోసం సమగ్ర ప్రతిపాదనల్ని రూపొందించాలని సీఎం కేసీఆర్‌ వారిని ఆదేశించారు. ఆర్టీసీని బలోపేతం చేసేందుకు రెండేళ్ల క్రితం చర్యలు చేపట్టామని.. సంస్థ గాడిలో పడుతున్న సమయంలో... కరోనా, డీజిల్‌ ధరల పెంపు భారంతో తిరిగి నష్టాల్లో కూరుకుపోయాయని సీఎం వ్యాఖ్యానించారు.
 
బస్సు ఛార్జీలను పెంచాల్సిందేనని మంత్రి పువ్వాడ అజయ్‌, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తెలిపారు. కరోనా సంక్షోభంతోపాటు డీజిల్‌ ధరలు పెరగడం వల్ల ఆర్టీసీ పరిస్థితి దిగజారిందని ముఖ్యమంత్రికి వివరించారు. ఏడాదిన్నరకాలంలో డీజిల్‌ ధరల పెరుగుదలతో రూ.550 కోట్లు, టైర్లు, ట్యూబులు వంటి విడిభాగాల ధరలతో మరో రూ.50 కోట్లు కలిపి... ఏటా 600 కోట్ల భారం పడుతోందన్నారు. 
 
ముఖ్యంగా, లాక్డౌన్ల వల్ల ఆర్టీసీ సుమారు రూ.3000 కోట్ల మేర నష్టపోయిందని సీఎం దృష్టికి తీసుకువచ్చారు. హైదరాబాద్‌ పరిధిలోనే నెలకు రూ.90 కోట్ల వరకు నష్టం వస్తోందన్నారు. ఈ కష్టకాలంలో ఛార్జీలు పెంచక తప్పదని ముఖ్యమంత్రి కేసీఆర్​ దృష్టికి తెచ్చారు.
 
ఆరేళ్లుగా ఛార్జీలను సవరించలేదని, విద్యుత్ శాఖను గట్టెక్కించడానికి ఇప్పుడు పెంచక తప్పదన్నారు. ఆర్టీసీతోపాటు విద్యుత్ అంశాలకు సంబంధించి వచ్చే మంత్రివర్గ సమావేశంలో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ అధికారులకు హామీ ఇచ్చారు.  ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను రాబోయే కేబినెట్ సమావేశానికి తీసుకురావాలని రవాణా, విద్యుత్‌ శాఖ మంత్రుల్ని, సంబంధిత అధికారుల్ని ముఖ్యమంత్రి ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jack review: సిద్ధు జొన్నలగడ్డ జాక్ చిత్రం ఎలావుందంటే.. జాక్ రివ్యూ

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments